Breaking News

భాజపాలో చేరిన ఓదెల తిరుపతి

మన ప్రగతి న్యూస్ /నర్సంపేట

నర్సంపేట పట్టణంలోని వల్లబ్ నగర్ కు చెందిన ఓదెల తిరుపతి నర్సంపేట పట్టణ అధ్యక్షులు గూడూరు సందీప్ అధ్యక్షతన భారతీయ జనతా పార్టీ వరంగల్ జిల్లా ప్రధాన కార్యదర్శి డా||గోగుల రాణా ప్రతాప్ రెడ్డి సమక్షంలో బిజెపి పార్టీలో చేరారు.ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ…భారతీయ జనతా పార్టీని బలోపేతం చేయడం కోసం ప్రతి ఒక్కరు,మీ లాంటి యువత ముందుండి నడుంబిగించి భారతీయ జనతా పార్టీ విజయంలో పాలుపంచుకోవాలని అన్నారు.ఈ కార్యక్రమంలో యువ మోర్చా జిల్లా ఉపాధ్యక్షుడు కొంకీసా విగ్నేష్ గౌడ్, బీజేవైఎం నియోజవర్గ మాజీ కన్వీనర్ జూలూరి మనీష్ గౌడ్ తదితరులు పాల్గొన్నారు.

సిద్దిపేట ఎమ్మెల్యే హరీష్ రావు కి వినతి పత్రం అందజేత..