Breaking News

నన్ను గెలిపించండి అభివృద్ధి ఏమిటో చూపిస్తా

పర్సు గుర్తుకే మీ ఓటు అభివృద్ధికి రాచ బాట

సమస్యల పరిష్కారమే నా ధ్యేయం

బోల్లోనిపల్లి కాంగ్రెస్ సర్పంచ్ అభ్యర్థి సిద్ధ సంతోష్

సిద్దిపేట ఎమ్మెల్యే హరీష్ రావు కి వినతి పత్రం అందజేత..

మన ప్రగతి న్యూస్/ నల్లబెల్లి

నల్లబెల్లి మండలంలోని బోల్లోనిపల్లి గ్రామ కాంగ్రెస్ సర్పంచ్ అభ్యర్థిగా సిద్ధ సంతోష్ విజయం పై ధీమా వ్యక్తం చేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ పర్సు గుర్తుపై ఓటు వేసి నన్ను గెలిపించాలని, నా గెలుపు గ్రామంలోని సమస్యలపై సమరమేనని అన్నారు. గ్రామంలో వార్డ్ మెంబర్ గా ఉన్నప్పుడే చాలా అభివృద్ధి చేశానని, పేద ప్రజల పట్ల గ్రామం పట్ల నాకు అభిమానం ఎక్కువగా ఉందని, నా సొంత బోర్ను కూడా ప్రజల అవసరాల కోసం వినియోగించుకున్నారని తెలిపారు. ప్రజా సమస్యలపై నిరంతరం పోరాటం చేస్తూ, గ్రామంలోని అనేక సమస్యలను పరిష్కరించానని అన్నారు. చెరువు కట్ట తెగి ఎవరు పట్టించుకోకపోతే ఎమ్మెల్యే దొంతి మాధవరెడ్డి సహాయంతో చెరువు కట్టను బాగు చేయించానని తెలిపారు. ముదిరాజు సంఘం అధ్యక్షుని గా చాలా కృషి చేశానని, అన్ని కులాల అభివృద్ధి తన ద్యేయమన్నారు. గ్రామంలో గ్రామ పంచాయతీ భవనం ఇప్పటికి లేదని, గ్రామ సమస్యలు మెండుగా ఉన్నాయని, నన్ను గెలిపిస్తే ఈ సమస్యల పరిష్కారానికి కృషి చేస్తానని అన్నారు. మా గ్రామానికి సంబంధించిన ఆడపడుచులు, నీటి కోసం తిప్పలు పడవద్దని నా బోరుబావి నుండి నీరు ఇచ్చానని, రాబోవు రోజులలో వాటర్ ట్యాంకుల ఏర్పాటుతో నా బోరుబావి నుండి నీటి అందిస్తానన్నారు. అభివృద్ధి అంటే నాకు చాలా ఇష్టం అని అభివృద్ధి కోసం నిరంతరం పాటు పడతానని ఎమ్మెల్యే మాధవ రెడ్డి సాయంతో గ్రామాన్ని అన్ని రంగాలలో ముందుకు తీసుకెళ్తానన్నారు. గ్రామ ప్రజలు ఆదరించి పర్సు గుర్తుపై ఓటు వేసి గెలిపించాల్సిందిగా కోరారు.