మన ప్రగతి న్యూస్/ నల్లబెల్లి
మండలంలోని జిల్లా ప్రజా పరిషత్ పాఠశాలలో ఏర్పాటుచేసిన పోలింగ్ కేంద్రాన్ని రెండో విడతలో జరగనున్న ఎన్నికల పోలింగ్ కు కలెక్టర్ ఆదేశానుసారం గ్రీన్ పోలింగ్ కేంద్రంగా సిద్ధం చేశారు. పోలింగ్ కేంద్రాలలో గ్రీన్ పోలింగ్ కేంద్రాల్లో ఓటర్లను ఆకుపచ్చని తోరణాలతో స్వాగతం పలుకుతూ గ్రీన్ మ్యాట్లను వేశారు. ఈ పోలింగ్ కేంద్రాల ముందు ఓటర్లను ఆకట్టుకునే విధంగా ముగ్గులు వేశారు. అదేవిధంగా వయోవృద్ధులు దివ్యాంగుల సౌకర్యం కొరకు విల్ చైర్లను ఏర్పాటు చేశారు. ఓటర్లు ఆహ్లాదకరమైన వాతావరణం లో ఓటు హక్కును వినియోగించుకోవాలని తెలిపారు.




