మన ప్రగతి న్యూస్/ నల్లబెల్లి
పాముకాటుతో అన్నదాత మృతి చెందిన సంఘటన మండలంలోని లెంకాలపల్లి గ్రామంలో సోమవారం చోటుచేసుకుంది. కుటుంబ సభ్యులు పోలీసుల కథనం ప్రకారం.
లెంకాలపల్లి గ్రామానికి చెందిన యాదండ్ల చిన్న కొమురయ్య (50) శుక్రవారం తనకు ఉన్నటువంటి వ్యవసాయ భూమిలో మక్కజొన్న సాగు చేస్తున్న సందర్భంలో ఎడ్లకు మేతేస్తున్న క్రమంలో విష సర్పం చేతికి కాటు వేయడంతో లబోదిబోమంటూ పరుగులు తీశాడు. ఇది గమనించిన కుటుంబ సభ్యులు గ్రామస్తులు 108 ద్వారా వరంగల్ ఎంజీఎం ఆసుపత్రి కి తరలించి చికిత్స చేయిస్తున్న క్రమంలో చికిత్స పొందుతూ సోమవారం తెల్లవారుజామున మృతి చెందాడు. మృతునికి భార్య అరుణ కుమారులు మునేందర్ రాజేందర్ ఉన్నారు. చిన్న కొమురయ్య మృతి చెందడంతో గ్రామస్తులు కన్నీటి పర్యంతమయ్యారు. కుటుంబ సభ్యుల ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసుకొని దర్యాప్తు చేస్తున్నట్లు స్థానిక ఎస్సై వి. గోవర్ధన్ పేర్కొన్నారు.


