-మేయర్ గా కొలగాని శ్రీనివాస్
-డిప్యూటీ మేయర్ గా యాదగిరి సునీల్ రావు
-కరీంనగర్లో బీజేపీ చరిత్ర సృష్టించింది.
-కరీంనగర్ అభివృద్దే మన లక్ష్యం.
-కేంద్ర హోంశాఖ సహాయ మంత్రి బండి సంజయ్.
మన ప్రగతి న్యూస్/కరీంనగర్ జిల్లా ప్రతినిధి:
కరీంనగర్ మున్సిపల్ కార్పొరేషన్ మేయర్ గా కొలగాని శ్రీనివాస్,డిప్యూటీ మేయర్ గా యాదగిరి సునీల్ రావు ఎన్నికయ్యారు.కరీంనగర్ నగర గడ్డ మీద బీజేపీ ఖాషాయ జెండా ఎగరవేసింది. సోమవారం మేయర్,డిప్యూటీ మేయర్,కార్పొరేటర్లు నూతనంగా బాధ్యతలు స్వీకరించారు.నగరంలో తొలిసారిగా బీజేపీ మేయర్ ప్రమాణ స్వీకారం చేశారు.కరీంనగర్కు బీజేపీ తొలి మేయర్గా ఎన్నికైన కొలగాని శ్రీనివాస్,డిప్యూటీ మేయర్గా యాదగిరి సునీల్ రావుకు కేంద్ర హోంశాఖ సహాయ మంత్రి బండి సంజయ్ అభినందనలు తెలిపారు.కేంద్ర సహాయ మంత్రి బండి సంజయ్ మాట్లాడుతూ బీజేపీకి మేయర్ పదవి రాకుండా ఉండేందుకు జరిగిన కుట్రలో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి కూడా భాగస్వాములు కావడం ఆశ్చర్యం కలిగించింది.గత రెండ్రోజులుగా అనేక కుట్రలు చేశారు.ఇబ్బంది పెట్టారు.నేను నమ్ముకున్న అమ్మవారి ఆశీస్సులు, వేములవాడ రాజన్న,కొండగట్టు అంజన్న,పాతబస్తీ భాగ్యలక్ష్మీ అమ్మవార్ల దీవెనలతో వాటిని అధిగమించినం.నేనడుగుతున్నా కాంగ్రెస్,బీఆర్ఎస్, ఎంఐఎం పార్టీలన్నీ ఒక్కటి కావడానికి కారణమేంటి? ప్రజాస్యామ్యాన్ని అపహాస్యం చేసేలా ఫాంహౌజ్ వేదికగా కుట్రలు ఎందుకు చేశారు?ఎవరిపై మీ కోపం? కరీంనగర్ లో 66 డివిజన్లలో 30 డివిజన్లలో బీజేపీ విజయం సాధించింది.స్వతంత్ర అభ్యర్థులు బీజేపీ లో చేరడంతో మ్యాజిక్ ఫిగర్ 34కు చేరింది.బీజేపీ పార్టీకి మరింత బలం చేకూరింది.దీంతో కరీంనగర్ లో బీజేపీ మేయర్ పీఠం స్వంతం చేసుకుంది.కాంగ్రెస్ గెలిచింది 14 సీట్లు,ఎంఐఎం గెలిచింది 3 సీట్లు, బీఆర్ఎస్ గెలిచింది 9 సీట్లు అన్నీ కలుపుకున్నా 26 సీట్లు మాత్రమే.మ్యాజిక్ ఫిగర్ దాటనే లేదు.ఇవన్నీ తెలిసి ఎందుకు బీజేపీని అడ్డుకునే ప్రయత్నం చేశారు.మీ చీకటి ఒప్పందాలేమిటి? మున్సిపల్ ఎన్నికలకు ముందు వాళ్లు కాంగ్రెస్, బీఆర్ఎస్, ఎంఐఎం ఆట స్టార్ట్ చేశారు.బీజేపీ ఆ ఆటకు ముగింపు ఇవ్వబోతున్నా ముఖ్యంగా కాంగ్రెస్ కు ఛాలెంజ్ విసురుతున్నా ఎక్కడికక్కడ 6 గ్యారంటీలను అమలు చేసేదాకా మీ మెడలు వంచుతాం.బీజేపీ రాష్ట్ర అధ్యక్షులు రామచంద్రరావు ఆధ్వర్యంలో కాంగ్రెస్ పతనానికి ముగింపు పలుకుతాం.అందుకు కరీంనగర్ వేదిక కాబోతోంది.ఈరోజు రాజకీయ విజయం మాత్రమే కాదు.ఇది ఎమోషనల్ మూమెంట్.ఇది మనలో చాలా మంది సంవత్సరాలుగా నిశ్శబ్దంగా మోస్తున్న కలలా అనిపిస్తుంది.ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ దార్శనికతపై విశ్వాసం ఉంచి,గౌరవప్రదంగా అభివృద్ధిని ఎంచుకున్న ఓటర్లకు నేను శిరస్సు వంచి నమస్కరిస్తున్నాను.కార్పొరేటర్ నుంచి వార్డుకు వాకింగ్ చేయడం,కరీంనగర్ మున్సిపల్ కార్పొరేషన్పై కాషాయ జెండా రెపరెపలాడుతుంటే ఇక్కడ నిలబడి బీజేపీ మేయర్ ప్రమాణ స్వీకారాన్ని చూడడం వరకు ఇది వ్యక్తిగతం.నేను ఈ ప్రయాణంలో జీవించాను.ఈ క్షణం వెనుక పోరాటాన్ని చూశాను.ఇది నా పార్టీ,ఇది నా బీజేపీ,ఇది కార్మికులను నేల నుండి పైకి లేపుతుంది మరియు వారికి చరిత్రను సాక్ష్యం ఇస్తుంది.ఈ పోరాటానికి తమ చెమటను,శక్తిని అందించిన ప్రతి కార్యకర్తకు ఈ విజయం దక్కుతుంది.ఒత్తిళ్లు,బెదిరింపులు,అవమానాలు ఎదుర్కొని ఇంకా వంగడానికి నిరాకరించిన వారు ఈ రోజు మీకు చెందుతుంది.మీరు కేవలం ప్రచారం చేయలేదు.మీరు నమ్మకాన్ని మీ భుజాలపై వేసుకున్నారు.మజ్లిస్ పార్టీ కార్యాలయం ఉన్న వార్డులోనే మన కార్యకర్తలు కాషాయ జెండాను ఎగురవేశారు.ఆ చూపు నాలో ఎప్పటికీ నిలిచిపోతుంది.ఇది ధైర్యం గురించి మాట్లాడుతుంది. ఇది మార్పు గురించి మాట్లాడుతుంది.కుట్రలు,ఒత్తిళ్ల వ్యూహాలు,మన నైతిక స్థైర్యాన్ని దెబ్బతీసేందుకు ఎన్ని ప్రయత్నాలు చేసినా బీజేపీ అండగా నిలిచింది. మేం వెనక్కి తగ్గలేదు.మేం రాజీపడలేదు.మేమే గెలుస్తామని చెప్పారు.మేము చేశాము.మనము కరీంనగర్ అభివృద్ధి లక్ష్యంగా ముందుకు నడవాలని ధానమంత్రి నరేంద్ర మోదీజీకి మాటల్లో చెప్పలేనంత కృతజ్ఞతలు తెలుపుతున్నాను.హోంమంత్రి అమిత్ షాకి తెలంగాణ బీజేపీ పట్ల ఉన్న విశ్వాసం మనకు అవసరమైనప్పుడు బలాన్ని ఇచ్చింది.ఈ ప్రయాణంలో మాతో పాటు నిలబడినందుకు బీజేపీ చీఫ్ నితిన్ నబిన్ జీ,జనరల్ సెక్రటరీ(ఆర్గ్)శ్రీ బీఎల్ సంతోష్ జీ,బీజేపీ తెలంగాణ అధ్యక్షుడు శ్రీ నారపరాజు రాంచందర్ రావు,రాష్ట్ర ఇంచార్జి శ్రీ అభయ్ పాటిల్ జీ, తెలంగాణ ఎన్నికల ఇన్ఛార్జ్లు శ్రీ శెలార్ ఆశిష్ జీ,శ్రీ అశోక్ పర్మాణి జీ,శ్రీమతి రేఖా శర్మలకు కేంద్ర సహాయ మంత్రి బండి ధన్యవాదాలు తెలిపారు.కరీంనగర్ లో బీజేపీకి జెండా ఎగరావేయడానికి కష్టపడ్డ పార్టీ కార్యకర్తలకు, నాయకులకు కేంద్ర హోంశాఖ సహాయమంత్రి బండి సంజయ్ హృదయపూర్వక కృతజ్ఞతలు తెలిపారు.


