Breaking News

ఉప్పల్–కీసరలో వరుస చోరీలు.. ముఠా అరెస్ట్

  • పోలీసుల ఆపరేషన్.. పాత నేరస్తులు అరెస్ట్

మన ప్రగతి న్యూస్ / కీసర, మేడ్చల్ జిల్లా స్టాపర్ :

మేడ్చల్–మల్కాజిగిరి జిల్లాలోని కీసర సర్కిల్ పరిధిలో ఇళ్లలో దొంగతనాలకు పాల్పడుతున్న ముగ్గురు పాత నేరస్తులను పోలీసులు అరెస్టు చేశారు. చార్మినార్ జోన్ టాస్క్ ఫోర్స్ బృందం, కీసర పోలీసులతో కలిసి నిర్వహించిన సంయుక్త ఆపరేషన్‌లో ఈ అరెస్టులు చోటుచేసుకున్నాయి. అమర్ రాజ్ కుమార్ రెడ్డి, అబ్దుల్ లతీఫ్ ఖాన్, గులాం హుస్సేన్ ఖాన్ ముఠాగా ఏర్పడి ఉప్పల్, కీసర ప్రాంతాల్లో పలు ఇళ్లలో చోరీలకు పాల్పడుతున్నట్లు పోలీసులు తెలిపారు. విశ్వసనీయ సమాచారం మేరకు నిందితులను పట్టుకుని విచారించగా పలు చోరీల కేసుల్లో వారి ప్రమేయం బయటపడింది.
నిందితుల వద్ద నుంచి సుమారు రూ.13 లక్షల విలువైన 65 గ్రాముల బంగారు ఆభరణాలు, 400 గ్రాముల వెండి ఆభరణాలు, మూడు బైకులు, ఏడు మొబైల్ ఫోన్లను పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. నిందితులపై కేసు నమోదు చేసి దర్యాప్తు కొనసాగిస్తున్నట్లు పోలీసులు వెల్లడించారు.

పొంగులేటి చెప్పారంటే”చెప్పిన పని”చేసినట్లే