మన ప్రగతి న్యూస్/దుబ్బాక
దుబ్బాక మున్సిపాలిటీ పరిధిలో ఒక పిచ్చికుక్క భయాందోళన సృష్టించింది. కేవలం గంట వ్యవధిలోనే 15 మందిపై దాడి చేసి గాయపరిచింది. వీరిలో ఒకరి పరిస్థితి విషయంగా ఉండటంతో సిద్దిపేట ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. మిగిలిన 14 మందికి దుబ్బాక ఆసుపత్రిలో చికిత్స అందిస్తున్నారు. ఈ ఘటనతో పట్టణ ప్రజలు తీవ్ర భయాందోళనకు గురవుతున్నారు.

