మన ప్రగతి న్యూస్/ గుండాల ప్రతినిధి :
వడదెబ్బతో వ్యక్తి మృతి చెందిన విషాద ఘటన మండలంలోని మాసాన్ పల్లి గ్రామంలో చోటుచేసుకుంది.స్థానికులు తెలిపిన వివరాల ప్రకారం గ్రామానికి చెందిన పాలడుగు సోమనర్సయ్య (43) రోజువారి పని ముగించుకుని ఇంటికి తిరిగి వచ్చిన సోమనసయ్య అస్వస్థతకు గురై కుప్పకూలిపోయాడు.మృతుడికి భార్య సోమలక్ష్మి, కూతురు శ్రీహర్ష ఉన్నారు.నిరుపేద బాధిత కుటుంబాన్ని ప్రభుత్వం ఆదుకోవాలని గ్రామస్తులు కోరుతున్నారు.

