మన ప్రగతి న్యూస్ /గుండాల ప్రతినిధి :
l
యాదాద్రి భువనగిరి జిల్లా గుండాల మండలం మాసాన్ పల్లి గ్రామానికి చెందిన బత్తిని మహేష్ గౌడ్ (24 ) గత నాలుగు రోజుల క్రితం బైక్ ప్రమాదంలో తల కు బలంగా దెబ్బలు తగలడంతో మహేష్ గౌడ్ ను మలక్పేట్ యశోద హాస్పిటల్లో చేర్పించినప్పటికీ చికిత్స అందించిన వైద్యులు బలమైన దెబ్బలు తగలడంతో డాక్టర్లు బ్రెయిన్ డెడ్ అయినట్లుగా గుర్తించారు. జీవన్ దాన్ సంస్థ వారి తల్లిదండ్రులు బత్తిని ఎల్లయ్య, మహేశ్వరి కి అవయవ దానం గురించి అవగాహన కల్పించారు. అవయవ దానానికి అంగీకరించిన తల్లిదండ్రులు 8 మందికి అవయవాలను దానం చేసినట్లుగా వారు తెలిపారు. బత్తిని మహేష్ గౌడ్ ఉప్పల్ లో మెట్రో షాపింగ్ మాల్ లో పనిచేస్తున్నట్లుగా తెలిపారు. వారికి ఒకే ఒక్క కుమారుడు కావడంతో తల్లిదండ్రులు గ్రామస్తులు కన్నీరు మున్నేరు అవుతున్నారు. తాను మరణించినా తన అవయవాలు దానం చేసి మరో ఎనిమిది మందికి పునర్జన్మను ఇచ్చాడు.

