మన ప్రగతి న్యూస్/ భూపాలపల్లి:
భూపాలపల్లి లోని మైసమ్మ దేవాలయం ప్రధాన రహదారి వద్ద పుడమి రాజు (44) సీఆర్ నగర్ నివాసి, తన మోటార్ సైకిల్పై సోమవారం రాత్రి అధిక వేగంతో వెళ్లి నియంత్రణ కోల్పోయి దేవాలయాన్ని ఢీకొని పడిపోవడంతో తలకు తీవ్ర గాయాలై సంఘ టన స్థలంలోనే మర ణించాడు.మృతుడి భార్య పుడమి మేరి భూపాలపల్లి పోలీస్ స్టేషన్లో ఇచ్చిన దరఖాస్తు మేరకు కేసు నమోదు చేయడం జరిగినది. ఫిర్యాదు దారురాలు మేరి తెలిపిన వివరాల ప్రకారం ప్రకారం ఇది మృతుడి స్వంత నిర్లక్ష్య డ్రైవింగ్ వల్ల జరిగిన ప్రమాదమని ఎవరిపైనా అనుమా నం లేదని తెలిపింది. ఈ మేరకు కేసు నమో దు చేసి దర్యాప్తు కొనసాగించబడుచున్నది అని భూపాల పల్లి ఇన్స్పెక్టర్ డి. నరేష్ కుమార్ తెలిపారు.అలాగే వాహనదారులు వాహనం నడిపేట ప్పుడు అధిక వేగం తో వెళ్లకుండా నెమ్మ దిగా వెళ్లాలని, ఎల్ల ప్పుడూ హెల్మెట్ దరించాలని కోరారు.

