సిరిసిల్ల కోర్టు కఠిన తీర్పు – ప్రతి ఒక్కరికి రూ.2 వేల జరిమానా
మన ప్రగతి న్యూస్ /రుద్రంగి/ రాజన్న సిరిసిల్ల జిల్లా :
రాజన్న సిరిసిల్ల జిల్లాలో సంచలనం సృష్టించిన వరకట్న హత్య కేసులో కోర్టు కఠిన నిర్ణయం తీసుకుంది. ఈ కేసులో భర్తతో పాటు మరో ఇద్దరికి జీవిత ఖైదు శిక్ష విధిస్తూ సిరిసిల్ల ప్రధాన న్యాయమూర్తి నీరజ గురువారం తీర్పు వెలువరించారు. అలాగే ప్రతి ఒక్కరికి రూ.2 వేల జరిమానా కూడా విధించారు.సిరిసిల్ల ఎస్పీ మహేష్ బీ గీతే వివరాల ప్రకారం, 2018 ఏప్రిల్ 3న రుద్రంగి గ్రామంలో అదనపు వరకట్నం కోసం హేమలతను భర్త సింగారపు జనార్ధన్, అతని మేనల్లుడు సాగర్, భర్త సోదరుడి కుమారుడు జనార్ధన్ కలిసి హత్య చేసినట్లు నిర్ధారణ అయింది. ఈ ఘటన అప్పట్లో జిల్లా వ్యాప్తంగా తీవ్ర కలకలం రేపింది.పోలీసుల దర్యాప్తులో నిందితులపై పక్కా ఆధారాలు సేకరించడంతో కోర్టు వారికి జీవిత ఖైదు విధించింది. ఈ కేసులో మరో నిందితుడు మైనర్ కావడంతో అతనిపై కేసు జువెనైల్ కోర్టులో కొనసాగుతున్నట్లు అధికారులు తెలిపారు.

