మన ప్రగతి న్యూస్/ నడికూడ:
జగద్గురు కాలజ్ఞాన కర్త శ్రీ శ్రీ శ్రీ మద్విరాట్ పోతులూరి వీర బ్రహ్మేంద్ర స్వామి ఆరాధన మహోత్సవం నడికూడ మండల కేంద్రంలోని విశ్వబ్రాహ్మణ సంఘం ఆధ్వర్యంలో వైశాఖ శుద్ధ దశమి ఆదివారం రోజున వైభవంగా నిర్వ హించారు. గణపతి పూజ, గోత్రనామర్చనాలు, బ్రహ్మంగారి సంకల్పం మొద లుకొని, ప్రత్యేక పూజలు నిర్వహించారు. ముందుగా స్వామి వారి చిత్రపటానికి మాలాధారణ, గంధం, పసుపు కుంకుమలతో ప్రత్యేకంగా అలంకరించారు. విశ్వ బ్రాహ్మణ సంఘం ఆధ్వర్యంలో బ్రహ్మంగారి పూజా కార్యక్రమాలు యధావిధిగా ప్రతి సంవత్సరం సాంప్రదాయ బద్ధంగా చేపట్టడం జరుగు తుందని కమిటీ సభ్యులు తెలిపారు. ఈ కార్యక్రమంలో విశ్వ బ్రాహ్మణ సంఘం మండల అధ్యక్షుడు కడివెండి నరేందర్ చారి, గౌరవ అధ్యక్షుడు బెజ్జంకి వెంకటయ్య చారి, గ్రామ కమిటీ అధ్యక్షుడు ఎలకంటి రాజు చారి, ఉపాధ్యక్షుడు బెజ్జంకి రాజేందర్ చారి, ప్రధాన కార్యదర్శి బండ్ల రాజు చారి, కోశాధికారి కడివెండి ప్రశాంత్ చారి, సహాయ కార్యదర్శి బండ్ల రమేష్ చారి, కమిటీ సభ్యులు క్రిష్ణాది సాంబయ్య చారి, కడివెండి రాజు చారి, విఘ్నేష్ చారి లు పాల్గొన్నారు.


