మన ప్రగతి న్యూస్/మిర్యాలగూడ:
మిర్యాలగూడ మండలం బాదలాపురం గ్రామానికి చెందిన ఉబ్బపల్లి వాసవి అదృశ్యం కావడం స్థానికంగా ఆందోళన కు గురిచేసింది. వాసవికి మూడు సంవ త్సరాల క్రితం మిర్యాలగూడ పట్టణం లోని గాంధీనగర్కు చెందిన ఉబ్బపల్లి వెంకటేష్తో వివాహం జరిగింది. ఈ దం పతులకు ఒక కుమారుడు ఉన్నాడు.గత పది రోజుల క్రితం పనికి వెళ్లే విషయ మై భార్యాభర్తల మధ్య గొడవ చోటు చేసుకో వడంతో వాసవి తన పుట్టిల్లు బాదలాపు రానికి వెళ్లింది. అనంతరం ఈ నెల 29వ తేదీ ఉదయం 10 గంటల సమయంలో భర్త ఇంటికి తిరిగి వెళ్తు న్నట్లు చెప్పి బ యలుదేరింది. అయితే ఆమె మిర్యాల గూడలోని తన ఇంటికి చేరుకోలేదు. వాసవి కోసం కుటుంబ సభ్యులు, బంధువుల ఇళ్లలో వెతికినా ఎక్కడా ఆచూకీ లభించలేదు. దీంతో భర్త ఉబ్బపల్లి వెంకటేష్ ఇచ్చిన ఫిర్యా దు మేరకు మిర్యాలగూడ రూరల్ పోలీసులు కేసు నమోదు చేసి, దర్యాప్తు ప్రారంభించారు. ఈ ఘటన పై పోలీసులు అన్ని కోణాల్లో విచారణ చేపట్టి వాసవి ఆచూకీ కోసం గాలింపు చర్యలు చేపట్టారు.

