మన ప్రగతి న్యూస్ /రామన్నపేట:
మండలంలోని లక్ష్మాపురం గ్రామానికి చెందిన గీత కార్మికుడు తాటి చెట్టు నుంచి పడి గాయపడ్డాడు.భీమగోని వెంకటేశం గౌడ్ (48) శుక్రవారం సాయంత్రం 4 గంటల సమయంలో తాటి చెట్టు ఎక్కి కల్లు గీస్తుండగా ప్రమాదవశాత్తు కిందపడినట్లు సమాచారం.ఈ ఘటనలో అతనికి కాళ్లు,నడుము భాగాల్లో తీవ్ర గాయాలు అయ్యాయి.సమీపంలో ఉన్న వారు గమనించి వెంటనే రామన్నపేట ఏరియా ఆసుపత్రికి తరలించారు.అక్కడి వైద్యులు ప్రాథమిక చికిత్స అనంతరం మెరుగైన చికిత్స కోసం నల్గొండ ఆసుపత్రికి తరలించారు.ప్రభుత్వం తక్షణమే స్పందించి భీమగాని వెంక టేశంకు కల్లుగీత కార్మికులకు ఇచ్చే ఎక్స్గ్రేషియా తక్షణమే చెల్లించి, ఆ కుటుంబాన్ని ఆదుకోవాలని తెలంగాణ కల్లు గీత కార్మిక సంఘం జిల్లా సహాయ కార్యదర్శి భావండ్లపల్లి బాలరాజు,జిల్లా కమిటీ సభ్యుడు కునూరు మల్లేశం ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు.

