- ఎస్ఐ నరేష్ రెడ్డి..
మన ప్రగతి న్యూస్/చొప్పదండి :
చొప్పదండి నియోజకవర్గం పరిధిలో శుక్ర వారం సాయంత్రం వెదురుగట్ట గ్రామ శివారులో పేకాట ఆడుతూ 8 మంది వ్యక్తులు పోలీసులకు పట్టుబ డ్డారు. వారి వద్ద నుండి 11030 రూ. లు స్వాధీనం చేసుకున్నారు. అనంతరం కేసు నమోదు చేసి దర్యాఫ్తు ప్రారంభించామని ఎస్ఐ నరేష్ రెడ్డి తెలిపారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ.. పేకాట ఆడిన, దొరికినా.. ప్రోత్సహిం చిన కఠిన చర్యలు తప్పవని హెచ్చరించారు.

