Breaking News

చేపల వేటకు వెళ్లి కాలువలో పడి యువకుడు మృతి..

మన ప్రగతి న్యూస్/ రామన్నపేట:

మండలంలోని దుబ్బాక లచ్చిరెడ్డి గూడెం శివారులో ఉన్న ఆసిఫ్ నగర్ కాలువలో చేపల వేటకు వెళ్లి కాలువలో పడి రాజు ఖిలో అనే యువకుడు మృత్యువాత పడ్డాడని రామన్నపేట ఎస్సై డి.నాగరాజు తెలియజేశారు. వివరాల్లోకి వెళితే ఫిర్యాది అయిన శేహాద్రి కుమార్ మరియు తన బందువు రాజు ఖిలో ఇద్దరు కలిసి ఒరిస్సా రాష్టం బండిగూడా గ్రామం నుండి రామన్న పేట కు సెంట్రింగ్ పని కోసం 20 రోజుల క్రితం వచ్చారని,01 మే 2026 రోజు మేడే సందర్భంగా సెలవు దినం కావడంతో ఈ ఇద్దరు మరియు ఫిర్యాది బాబాయి కలిసి దుబ్బాక మీదిగా లచ్చిరెడ్డి గూడెం శివారులో ఉన్న అసిప్ నగర్ కాలువలో మధ్యాహ్నం సుమారు3.30 గంటల సమయంలో చేపలను పట్టడా నికి దిగగా రాజుఖిలో ప్రమాదవశాత్తు బుడదలో మునిగి చనిపోయాడని ఫిర్యాదు రాగా.. కేసు నమోదు చేసుకొని దర్యాప్తు చేస్తున్నామని ఎస్ఐ డి. నాగరాజు తెలిపారు.

పేకాట ఆడుతూ 8 మంది అరెస్ట్..