Breaking News

వివాహిత జ్యోతి అనుమానాస్పద స్థితిలో మృతి

మన ప్రగతి న్యూస్/గజ్వెల్ డివిజన్ ప్రతినిధి:

సిద్దిపేట జిల్లా మునిగడప గ్రామంలో వివాహిత జ్యోతి అనుమానాస్పద స్థితిలో మృతి చెందిన సంఘటన చోటు చేసుకుంది.మునిగడప గ్రామానికి చెందిన తిరుపతి (60) మొదటి భార్య చనిపోవడంతో రెండవ వివాహం చేసుకున్నాడు రెండవ భార్య కూడా చనిపోవడంతో కొనాయిపల్లి గ్రామానికి చెందిన జ్యోతితో మొబైల్ ఫోన్లో పరిచయం అవ్వగా ఆ పరిచయం ప్రేమగా మారి జ్యోతిని ప్రేమ వివాహం చేసుకున్నాడు.జ్యోతికి మాయమాటలు చెప్పి వివాహం చేసుకున్నాడని జ్యోతి బంధువులు ఆరోపిస్తున్నారు.తిరుపతి జ్యోతి లకు ఒక కుమారుడు ఉన్నాడు. తిరుపతి తల్లిదండ్రులు తిరుపతి తో కలిసి జ్యోతిని చంపేసారని జ్యోతి బంధువులు ఆరోపిస్తున్నారు.ఇరువర్గాలు గజ్వేల్ పోలీస్ స్టేషన్ ఎదురుగా దాడులకు పాల్పడగా ఉద్రిక్తత వాతావరణం చోటుచేసుకుంది. జ్యోతి భర్త తిరుపతిని పోలీసులు అదుపులోకి తీసుకొని గజ్వేల్ పోలీస్ స్టేషన్ లోనికి తీసుకువెళ్లారు. పోలీసుల కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు.

కుషాయిగూడలో బాలుడు అదృశ్యం..