మన ప్రతి న్యూస్/ మొగుళ్లపల్లి:
బావిలో దూకి యువకుడు ఆత్మ హత్య చేసుకున్న సంఘటన మండలం లోని పర్లపల్లి గ్రామం లో చోటు చేసుకుంది. మొగుళ్లపల్లి ఎస్సై సురేష్ కథనం ప్రకారం గ్రామానికి చెందిన సుంకరి సాయి కృష్ణ (27) ఉదయం గ్రామంలోని కృష్ణ వాటర్ ప్లాంట్ కు వెళ్లగా కృష్ణను అక్కడ ఉన్న అక్క పెళ్లి శ్రీనివాస్ ప్రశ్నించగా గత కొన్ని రోజుల నుండి ఆరోగ్య సమస్యలతో బాధప డుతున్నానని చెప్పా డు.కొన్ని రోజులుగా ఆరోగ్య సమస్యలతో బాధపడుతుండగా జీవితంపై విరక్తి చెంది శుక్రవారం ఉదయం గ్రామంలోని నల్లాల బావిలో దూకి ఆత్మ హత్య చేసుకున్నాడు. కాగా మృతుడి తండ్రి సుంకరి వెంకట్రాజం ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు ఎస్సై తెలిపారు.

