మన ప్రగతి న్యూస్ /గజ్వెల్ డివిజన్ ప్రతినిధి:
చెరువులో పడి మహిళ మృతి చెందిన ఘటన మున్సిపాలిటీలో శుక్రవారం చోటు చేసుకుంది, సానికులు తెలిపిన వివరాల ప్రకారం రాయపోల్ మండలానికి చెందిన కోయల మమత (32)కు భర్త రాజు, కొడుకు భాను ప్రసాద్ (4) కూతురు శివాని(5) కలిసి గజ్వేల్ లో ఉంటున్నారు.మమత గురువారం ఉదయం ఇంట్లో చెప్పి పని కోసం వెళ్లి సాయంత్రం వరకు రాలేదు, భర్త రాజు చుట్టుపక్కల తెలిసిన వాళ్ళ దగ్గర వెతికిన సమాచారం లభించలేదు, శుక్రవారం ఉదయం గజ్వేల్ లోని పాండవుల చెరువులో మమత శవం మై తేలింది.చుట్టుపక్కల చూసి కుటుంబ సభ్యులకు సమాచారం అందించారు.ఈ సంఘటనపై పోలీసులు కేసు నమోదు చేసుకొని విచారణ చేపట్టారు.


