మన ప్రగతి న్యూస్/నడికూడ:
హనుమకొండ జిల్లా టియుడబ్ల్యూజే ( ఐజేయు) యూనియన్ జిల్లా కార్యవర్గ సభ్యుడిగా నడికూడ మండల కేంద్రానికి చెందిన జర్నలిస్ట్ మహమ్మద్ జమా లుద్దీన్ (సాక్షి) ఏకగ్రీవంగా ఎన్నికయ్యారు. శనివారం హనుమకొండ నగరం లోని గ్రేటర్ వరంగల్ లో జరిగిన టియు డబ్ల్యూజే (ఐజేయు) జిల్లా ఎన్నికల్లో జిల్లా కార్యవర్గ సభ్యుడిగా ఏకగ్రీవంగా ఎన్నికయ్యారు. వీరికి నడికూడ మండల జర్నలిస్టులు గడ్డం బాలరాజు, నారగాని రమేష్, తోంబురపు రజినీకాంత్, బెజ్జంకి రాజేందర్, తాళ్ళ రవి, యాలాల మహేందర్ లు శుభాకాంక్షలు తెలియజేశారు. అనంతరం తన ఎన్నికకు సహకరించిన జిల్లా కమిటీ కి ధన్యవాదాలు తెలిపారు.

