మన ప్రగతి న్యూస్/నడికూడ:
టియుడబ్ల్యూజె( ఐజేయు ) రాష్ట్ర అధ్య క్షుడు కె.విరహత్ అలీ ని శనివారం హనుమకొండ జిల్లా ప్రెస్ క్లబ్ లో నడి కూడ మండల జర్నలిస్టులు మర్యాద పూర్వకంగా కలిసి పుష్పగుచ్చం అంద జేశారు. అనంతరం మండల జర్నలి స్టుల సమస్యలు, నూతన అక్రిడేషన్ కార్డ్స్, జర్నలిస్టుల ఇళ్ల స్థలాలు, హెల్త్ కార్డులు, ఇతర సమస్యలను వారి దృష్టికి తీసుకెళ్లడం జరిగింది. సానుకూ లంగా స్పందించిన రాష్ట్ర అధ్యక్షుడు సీఎం రేవంత్ రెడ్డి, రెవెన్యూ సమాచార శాఖ మంత్రి పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి లతో మరియు సంబంధిత అధికారు లతో చర్చించి, సమస్యలు పరిష్కారమయ్యే విధంగా చూస్తానని హామీ ఇచ్చారు. కలిసిన వారిలో మండల జర్నలిస్టులు నారగాని రమేష్, గడ్డం బాలరాజు, మహమ్మద్ జమాలుధ్ధీన్, తోంబురపు రజినీకాంత్, బెజ్జంకి రాజేందర్, తాళ్ళ రవి, యాలాల మహేందర్ లు ఉన్నారు.

