Breaking News

ఫోక్సో కేసు నిందితుడు బండి సాయి భగీరథను వెంటనే అరెస్టు చేయాలిమన ప్రగతి న్యూస్/ గుండాల ప్రతినిధి:ఫోక్సో కేసు నిందితుడు,కేంద్ర మంత్రి బండి సంజయ్ కుమారుడు బండి సాయి భగీరథను వెంటనే అరెస్టు చేసి బాధితురాలికి సత్వర న్యాయం చెయ్యాలని సిపిఎం యాదాద్రి భువనగిరి జిల్లా కమిటీ సభ్యులు మద్దెపురం రాజు రాష్ట్ర ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు.గురువారం గుండాలలో విలేకరులతో మాట్లాడుతూ నిందుతునిపై పోక్సో చట్టం క్రింద కేసు నమోదయి ఐదారు రోజులు దాటినా ఇప్పటి వరకు అరెస్టు చేయకపోవడం దుర్మార్గమైన చర్య అన్నారు.17 యేళ్ళ మైనర్ బాధితురాలు కుటుంబ సభ్యులు ఫిర్యాదు చేయడానికి వెళ్తే,పోలీసులు వ్యవహరించిన తీరు అత్యంత దారుణంగా ఉందని విమర్శించారు.బాధితులను స్టేషన్లోనే ఉంచి ఆ సమాచారాన్ని నిందితులకు చేరవేశారని ఆరోపించారు. నిందితులు కరీంనగర్లో బాధితురాలిపై హానీ ట్రాప్ కేసు పెట్టే వరకు వేచిచూసి,ఆ తరువాతే ఫిర్యాదు స్వీకరించడం చూస్తుంటే చట్టం పలుకుబడి గల వారి చుట్టంగా మారిందనే అర్ధం అవుతుందని అన్నారు.భేటీ బచావో అంటూ గొప్పలు చెప్పుకునే బీజేపీ నేతలు దీనికి ఏం సమాధానం చెప్తారని ప్రశ్నించారు.బీజేపీ నాయకుల నుంచే మహిళలకు,బాలికలకు రక్షణ లేకుండా పోయిందని ఆవేదన వ్యక్తం చేశారు.గతంలో దేశాన్ని కుదిపేసిన ఉత్తరప్రదేశ్ హత్రాస్ ఘటన వల్లయోధులపై బీజేపీ ఎంపీ బ్రజ్ భూషణ్ సింగ్ కేసుల్లో బీజేపీ ప్రభుత్వం ఎలాగైతే నిందుతులను కాపాడే ప్రయత్నం చేసిందో,ఇప్పుడు అదే దోరణి కనిపిస్తుందని పేర్కొన్నారు.బాధితురాలికి అండగా నిలవాల్సిన ప్రభుత్వం,పోలీసులు నిందుతులకు కొమ్ము కాయడం సరికాదని,ఇప్పటికైనా రాజకీయ వత్తిళ్లకు తలొగ్గకుండా నిందుతుణ్ణి వెంటనే అరెస్టు చేసి,బాధిత కుటుంబానికి రక్షణ కల్పించాలని డిమాండ్ చేశారు.

రాష్ట్ర అధ్యక్షుడిని కలిసిన నడికూడ జర్నలిస్టులు..

మన ప్రగతి న్యూస్/నడికూడ:

టియుడబ్ల్యూజె( ఐజేయు ) రాష్ట్ర అధ్య క్షుడు కె.విరహత్ అలీ ని శనివారం హనుమకొండ జిల్లా ప్రెస్ క్లబ్ లో నడి కూడ మండల జర్నలిస్టులు మర్యాద పూర్వకంగా కలిసి పుష్పగుచ్చం అంద జేశారు. అనంతరం మండల జర్నలి స్టుల సమస్యలు, నూతన అక్రిడేషన్ కార్డ్స్, జర్నలిస్టుల ఇళ్ల స్థలాలు, హెల్త్ కార్డులు, ఇతర సమస్యలను వారి దృష్టికి తీసుకెళ్లడం జరిగింది. సానుకూ లంగా స్పందించిన రాష్ట్ర అధ్యక్షుడు సీఎం రేవంత్ రెడ్డి, రెవెన్యూ సమాచార శాఖ మంత్రి పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి లతో మరియు సంబంధిత అధికారు లతో చర్చించి, సమస్యలు పరిష్కారమయ్యే విధంగా చూస్తానని హామీ ఇచ్చారు. కలిసిన వారిలో మండల జర్నలిస్టులు నారగాని రమేష్, గడ్డం బాలరాజు, మహమ్మద్ జమాలుధ్ధీన్, తోంబురపు రజినీకాంత్, బెజ్జంకి రాజేందర్, తాళ్ళ రవి, యాలాల మహేందర్ లు ఉన్నారు.

హనుమకొండ జిల్లా జనరల్ సెక్రటరీగా గడ్డం బాలరాజు..