Breaking News

80 ఏళ్ల వృద్ధుడి పై హత్యాయత్నం..

మన ప్రగతి న్యూస్/మెదక్ ప్రతినిధి:

మెదక్ టౌన్ దయారా వీధికి చెందిన చుక్క వెంకయ్య తన ఆస్తిని తన పేరు మీద చేయమన్నందుకు గాను దాడికి గురయ్యాడు. పెద్ద కుమారుడు గణేష్, పెద్ద కూతురు సుజాత, మనుమరాలు గాయత్రి, భార్య సులోచన అందరూ కలిసి తనపై కర్రలతో మరియు ఇనుప రాడ్ లతో దాడిచేసి, తీవ్రంగా గాయ పరిచారు. మరొకసారి ఆస్తిని అడిగితే చంపేస్తామని బెదిరిస్తున్నారని ఆవేదన వ్యక్తం చేశాడు. ఈ ఈ వృద్ధాప్యంలో అండగా ఉండవలసిన కుటుంబ సభ్యు లు తనపై దాడి చేయడంతో కన్నీరు మున్నీరయ్యారు. ఆస్తిని తనకు ఇప్పించి, న్యాయం చేయాలని కోరారు. తన చిన్న కుమారుడు చేదోడు వాదోడుగా ఉండటంతో అతడి పై కూడా దాడి చేసే అవకాశం ఉందని, తన చిన్న కుమారుడి కి రక్షణ కల్పించి, తనపై దా డి చేసిన వీరందరి పై చట్టరీత్యా చర్యలు తీసుకొని, జిల్లా కలెక్టర్, ఎస్పీ, టౌన్ సిఐ లను బాధిత వృద్ధుడు ఆదుకోవాలని కోరాడు.

గంగపుత్రులను అధికారికంగా గుర్తించాలి