Breaking News

ఫోక్సో కేసు నిందితుడు బండి సాయి భగీరథను వెంటనే అరెస్టు చేయాలిమన ప్రగతి న్యూస్/ గుండాల ప్రతినిధి:ఫోక్సో కేసు నిందితుడు,కేంద్ర మంత్రి బండి సంజయ్ కుమారుడు బండి సాయి భగీరథను వెంటనే అరెస్టు చేసి బాధితురాలికి సత్వర న్యాయం చెయ్యాలని సిపిఎం యాదాద్రి భువనగిరి జిల్లా కమిటీ సభ్యులు మద్దెపురం రాజు రాష్ట్ర ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు.గురువారం గుండాలలో విలేకరులతో మాట్లాడుతూ నిందుతునిపై పోక్సో చట్టం క్రింద కేసు నమోదయి ఐదారు రోజులు దాటినా ఇప్పటి వరకు అరెస్టు చేయకపోవడం దుర్మార్గమైన చర్య అన్నారు.17 యేళ్ళ మైనర్ బాధితురాలు కుటుంబ సభ్యులు ఫిర్యాదు చేయడానికి వెళ్తే,పోలీసులు వ్యవహరించిన తీరు అత్యంత దారుణంగా ఉందని విమర్శించారు.బాధితులను స్టేషన్లోనే ఉంచి ఆ సమాచారాన్ని నిందితులకు చేరవేశారని ఆరోపించారు. నిందితులు కరీంనగర్లో బాధితురాలిపై హానీ ట్రాప్ కేసు పెట్టే వరకు వేచిచూసి,ఆ తరువాతే ఫిర్యాదు స్వీకరించడం చూస్తుంటే చట్టం పలుకుబడి గల వారి చుట్టంగా మారిందనే అర్ధం అవుతుందని అన్నారు.భేటీ బచావో అంటూ గొప్పలు చెప్పుకునే బీజేపీ నేతలు దీనికి ఏం సమాధానం చెప్తారని ప్రశ్నించారు.బీజేపీ నాయకుల నుంచే మహిళలకు,బాలికలకు రక్షణ లేకుండా పోయిందని ఆవేదన వ్యక్తం చేశారు.గతంలో దేశాన్ని కుదిపేసిన ఉత్తరప్రదేశ్ హత్రాస్ ఘటన వల్లయోధులపై బీజేపీ ఎంపీ బ్రజ్ భూషణ్ సింగ్ కేసుల్లో బీజేపీ ప్రభుత్వం ఎలాగైతే నిందుతులను కాపాడే ప్రయత్నం చేసిందో,ఇప్పుడు అదే దోరణి కనిపిస్తుందని పేర్కొన్నారు.బాధితురాలికి అండగా నిలవాల్సిన ప్రభుత్వం,పోలీసులు నిందుతులకు కొమ్ము కాయడం సరికాదని,ఇప్పటికైనా రాజకీయ వత్తిళ్లకు తలొగ్గకుండా నిందుతుణ్ణి వెంటనే అరెస్టు చేసి,బాధిత కుటుంబానికి రక్షణ కల్పించాలని డిమాండ్ చేశారు.

బీసీ ఏ కులాలు మేల్కొనండి

జరుగుతున్న అన్యాయాన్ని ఎదిరించండి

మన ప్రగతి న్యూస్/ నర్సంపేట

ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డిని కలిసిన జిల్లా సుడా చైర్మన్,వైరా ఎమ్మెల్యే

తెలంగాణ బి సి ఏ హక్కుల పరిరక్షణ సమితి కోశాధికారి,తెలంగాణ గంగపుత్ర యువత అధ్యక్షులు అంబటి సుధాకర్ బి సి ఏ కులాలను, గంగపుత్రులను జాగృతం చేయడంలో భాగంగా నర్సంపేట గంగపుత్ర సంఘానికి హాజరై నర్సంపేట గంగపుత్ర సంఘం అధ్యక్షులు గుంటి సంజీవ ఆధ్వర్యంలో ఏర్పాటుచేసిన సమావేశంలో మాట్లాడుతూ గంగపుత్ర జాతీయులు మేల్కోవాల్సిన అవసరం ఉందని అనాదిగా మన కులం నిరాదారాణాకు గురవుతున్నదని ఇప్పటికే ముదిరాజులు మన కులాన్ని ఐజాక్ చేశారని చేపలు పట్టుట గంగపుత్రుల కులవృత్తి,తాత ముత్తాతల నుండి చేపలు పట్టుకొని జీవిస్తున్న వాళ్ళము మనమైతే చెరువులలో మనకు సభ్యత్వం లేకుండా చేశారని, ప్రభుత్వం చేపల చెరువులలో సభ్యత్వాలు చెరువులపై హక్కులు మనకే కల్పించాలని డిమాండ్ చేశారు. అంతేకాకుండా ఈ మధ్యన బీసీఏ కులం లోకి రావడానికి ముదిరాజుల ప్రయత్నిస్తున్నారని, బీసీఏలో ఉన్న 57 కులాల జనాభాతో పోల్చుకుంటే వారి జనాభా సమానంగా ఉంటుందని, జనాభా పరంగా వారు ఎక్కువ సంఖ్యలో ఉండటం వలన బీసీఏ లో ఉన్న కులాల మనుగడ ప్రశ్నార్థకం అవుతుందని అన్నారు. అందుకే బిసి ఏ లో ఉన్న కులాలు మేలుకోవాల్సిన అవసరం ఉందని తమకు జరుగుతున్న అన్యాయాన్ని ఎదిరించాల్సిన సమయం వచ్చిందని అన్నారు. జనాభా లెక్కల్లో కూడా గంగపుత్ర జాతిని ప్రభుత్వం చూపెట్టలేదని తక్షణమే గంగపుత్రులను చూపెట్టాలని అన్నారు. విద్య, ఉద్యోగ అవకాశాలలో ఇప్పటికే వెనుకబడి ఉన్నామని ముదిరాజులను బీసీ ఏ లో కలిపితే మన పిల్లలు వెనుకబడి పోతారని తెలిపారు. ఆర్థికంగా ముదిరాజులు బలంగా ఉన్నారని వారిని బీసీ ఏ లో కలపద్దని ప్రభుత్వానికి విజ్ఞప్తి చేశారు. ఇందిరాపార్క్ వద్ద ధర్నా చేయడానికి సిద్ధంగా ఉన్నామని తెలిపారు.ఈ కార్యక్రమంలో ఉపాధ్యక్షులు, ఎర్రబోయిన కిషన్, జీజుల సాగర్, మేదరబోయిన సత్యనారాయణ, చింతల టార్జాన్,అంకాల సాంబయ్య,అంకాల సుదర్శన్, అంకాల మల్లికార్జున్, గుంటి శ్రీనివాసు పెద్దపెళ్లి కేదారి, పూస యాకాంబరం, తదితరులు పాల్గొన్నారు.