Breaking News

ఫోక్సో కేసు నిందితుడు బండి సాయి భగీరథను వెంటనే అరెస్టు చేయాలిమన ప్రగతి న్యూస్/ గుండాల ప్రతినిధి:ఫోక్సో కేసు నిందితుడు,కేంద్ర మంత్రి బండి సంజయ్ కుమారుడు బండి సాయి భగీరథను వెంటనే అరెస్టు చేసి బాధితురాలికి సత్వర న్యాయం చెయ్యాలని సిపిఎం యాదాద్రి భువనగిరి జిల్లా కమిటీ సభ్యులు మద్దెపురం రాజు రాష్ట్ర ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు.గురువారం గుండాలలో విలేకరులతో మాట్లాడుతూ నిందుతునిపై పోక్సో చట్టం క్రింద కేసు నమోదయి ఐదారు రోజులు దాటినా ఇప్పటి వరకు అరెస్టు చేయకపోవడం దుర్మార్గమైన చర్య అన్నారు.17 యేళ్ళ మైనర్ బాధితురాలు కుటుంబ సభ్యులు ఫిర్యాదు చేయడానికి వెళ్తే,పోలీసులు వ్యవహరించిన తీరు అత్యంత దారుణంగా ఉందని విమర్శించారు.బాధితులను స్టేషన్లోనే ఉంచి ఆ సమాచారాన్ని నిందితులకు చేరవేశారని ఆరోపించారు. నిందితులు కరీంనగర్లో బాధితురాలిపై హానీ ట్రాప్ కేసు పెట్టే వరకు వేచిచూసి,ఆ తరువాతే ఫిర్యాదు స్వీకరించడం చూస్తుంటే చట్టం పలుకుబడి గల వారి చుట్టంగా మారిందనే అర్ధం అవుతుందని అన్నారు.భేటీ బచావో అంటూ గొప్పలు చెప్పుకునే బీజేపీ నేతలు దీనికి ఏం సమాధానం చెప్తారని ప్రశ్నించారు.బీజేపీ నాయకుల నుంచే మహిళలకు,బాలికలకు రక్షణ లేకుండా పోయిందని ఆవేదన వ్యక్తం చేశారు.గతంలో దేశాన్ని కుదిపేసిన ఉత్తరప్రదేశ్ హత్రాస్ ఘటన వల్లయోధులపై బీజేపీ ఎంపీ బ్రజ్ భూషణ్ సింగ్ కేసుల్లో బీజేపీ ప్రభుత్వం ఎలాగైతే నిందుతులను కాపాడే ప్రయత్నం చేసిందో,ఇప్పుడు అదే దోరణి కనిపిస్తుందని పేర్కొన్నారు.బాధితురాలికి అండగా నిలవాల్సిన ప్రభుత్వం,పోలీసులు నిందుతులకు కొమ్ము కాయడం సరికాదని,ఇప్పటికైనా రాజకీయ వత్తిళ్లకు తలొగ్గకుండా నిందుతుణ్ణి వెంటనే అరెస్టు చేసి,బాధిత కుటుంబానికి రక్షణ కల్పించాలని డిమాండ్ చేశారు.

ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డిని కలిసిన జిల్లా సుడా చైర్మన్,వైరా ఎమ్మెల్యే

మన ప్రగతి న్యూస్ /వైరా ప్రతినిధి:

హైదరాబాద్‌లోని ముఖ్యమంత్రి క్యాంపు కార్యాలయంలో తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ని ఖమ్మం జిల్లా స్తంభాద్రి పట్టణాభివృద్ధి సంస్థ (సుడా) చైర్మన్ పువ్వాళ్ల దుర్గాప్రసాద్, వైరా శాసనసభ్యులు మాలోత్ రాందాస్ నాయక్ మర్యాదపూర్వకంగా కలిశారు. ఈ సందర్భంగా పుష్పగుచ్ఛం అందించి శాలువాతో సత్కరించారు.రాష్ట్ర అభివృద్ధి, ప్రజా సంక్షేమ కార్యక్రమాల అమలులో ముఖ్యమంత్రి నాయకత్వం అభినందనీయమని కొనియాడారు. అనంతరం అటవీ, దేవాదాయ శాఖ మంత్రి కొండా సురేఖను కలిసి శుభాకాంక్షలు తెలిపారు.ఖమ్మం జిల్లా అభివృద్ధి, పట్టణ మౌలిక వసతుల విస్తరణ, ప్రజా సమస్యల పరిష్కారం వంటి అంశాలపై చర్చించినట్లు నాయకులు తెలిపారు.ఈ కార్యక్రమంలో పార్లమెంట్ సభ్యులు చామళ్ళ కిరణ్ కుమార్ రెడ్డి , రాష్ట్ర గిడ్డంగుల సంస్థ చైర్మన్ రాయల నాగేశ్వరరావు, ఖమ్మం జిల్లా కాంగ్రెస్ కమిటీ అధ్యక్షులు నూతి సత్యనారాయణ గౌడ్, జిల్లా ఓబీసీ అధ్యక్షులు పుచ్చకాయల వీరభద్రం, కొప్పురావూరి వెంకటకృష్ణ తదితరులు పాల్గొన్నారు.

ముదిరాజ్ కులస్తులను బిసి ఎ లో చేర్చవద్దు..