
మన ప్రగతి న్యూస్ /వైరా ప్రతినిధి:
హైదరాబాద్లోని ముఖ్యమంత్రి క్యాంపు కార్యాలయంలో తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ని ఖమ్మం జిల్లా స్తంభాద్రి పట్టణాభివృద్ధి సంస్థ (సుడా) చైర్మన్ పువ్వాళ్ల దుర్గాప్రసాద్, వైరా శాసనసభ్యులు మాలోత్ రాందాస్ నాయక్ మర్యాదపూర్వకంగా కలిశారు. ఈ సందర్భంగా పుష్పగుచ్ఛం అందించి శాలువాతో సత్కరించారు.రాష్ట్ర అభివృద్ధి, ప్రజా సంక్షేమ కార్యక్రమాల అమలులో ముఖ్యమంత్రి నాయకత్వం అభినందనీయమని కొనియాడారు. అనంతరం అటవీ, దేవాదాయ శాఖ మంత్రి కొండా సురేఖను కలిసి శుభాకాంక్షలు తెలిపారు.ఖమ్మం జిల్లా అభివృద్ధి, పట్టణ మౌలిక వసతుల విస్తరణ, ప్రజా సమస్యల పరిష్కారం వంటి అంశాలపై చర్చించినట్లు నాయకులు తెలిపారు.ఈ కార్యక్రమంలో పార్లమెంట్ సభ్యులు చామళ్ళ కిరణ్ కుమార్ రెడ్డి , రాష్ట్ర గిడ్డంగుల సంస్థ చైర్మన్ రాయల నాగేశ్వరరావు, ఖమ్మం జిల్లా కాంగ్రెస్ కమిటీ అధ్యక్షులు నూతి సత్యనారాయణ గౌడ్, జిల్లా ఓబీసీ అధ్యక్షులు పుచ్చకాయల వీరభద్రం, కొప్పురావూరి వెంకటకృష్ణ తదితరులు పాల్గొన్నారు.

