Breaking News

ఫోక్సో కేసు నిందితుడు బండి సాయి భగీరథను వెంటనే అరెస్టు చేయాలిమన ప్రగతి న్యూస్/ గుండాల ప్రతినిధి:ఫోక్సో కేసు నిందితుడు,కేంద్ర మంత్రి బండి సంజయ్ కుమారుడు బండి సాయి భగీరథను వెంటనే అరెస్టు చేసి బాధితురాలికి సత్వర న్యాయం చెయ్యాలని సిపిఎం యాదాద్రి భువనగిరి జిల్లా కమిటీ సభ్యులు మద్దెపురం రాజు రాష్ట్ర ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు.గురువారం గుండాలలో విలేకరులతో మాట్లాడుతూ నిందుతునిపై పోక్సో చట్టం క్రింద కేసు నమోదయి ఐదారు రోజులు దాటినా ఇప్పటి వరకు అరెస్టు చేయకపోవడం దుర్మార్గమైన చర్య అన్నారు.17 యేళ్ళ మైనర్ బాధితురాలు కుటుంబ సభ్యులు ఫిర్యాదు చేయడానికి వెళ్తే,పోలీసులు వ్యవహరించిన తీరు అత్యంత దారుణంగా ఉందని విమర్శించారు.బాధితులను స్టేషన్లోనే ఉంచి ఆ సమాచారాన్ని నిందితులకు చేరవేశారని ఆరోపించారు. నిందితులు కరీంనగర్లో బాధితురాలిపై హానీ ట్రాప్ కేసు పెట్టే వరకు వేచిచూసి,ఆ తరువాతే ఫిర్యాదు స్వీకరించడం చూస్తుంటే చట్టం పలుకుబడి గల వారి చుట్టంగా మారిందనే అర్ధం అవుతుందని అన్నారు.భేటీ బచావో అంటూ గొప్పలు చెప్పుకునే బీజేపీ నేతలు దీనికి ఏం సమాధానం చెప్తారని ప్రశ్నించారు.బీజేపీ నాయకుల నుంచే మహిళలకు,బాలికలకు రక్షణ లేకుండా పోయిందని ఆవేదన వ్యక్తం చేశారు.గతంలో దేశాన్ని కుదిపేసిన ఉత్తరప్రదేశ్ హత్రాస్ ఘటన వల్లయోధులపై బీజేపీ ఎంపీ బ్రజ్ భూషణ్ సింగ్ కేసుల్లో బీజేపీ ప్రభుత్వం ఎలాగైతే నిందుతులను కాపాడే ప్రయత్నం చేసిందో,ఇప్పుడు అదే దోరణి కనిపిస్తుందని పేర్కొన్నారు.బాధితురాలికి అండగా నిలవాల్సిన ప్రభుత్వం,పోలీసులు నిందుతులకు కొమ్ము కాయడం సరికాదని,ఇప్పటికైనా రాజకీయ వత్తిళ్లకు తలొగ్గకుండా నిందుతుణ్ణి వెంటనే అరెస్టు చేసి,బాధిత కుటుంబానికి రక్షణ కల్పించాలని డిమాండ్ చేశారు.

ముదిరాజ్ కులస్తులను బిసి ఎ లో చేర్చవద్దు..

  • గుంటి సంజీవ, గంగ పుత్ర సంఘం అధ్యక్షులు.

మన ప్రగతి న్యూస్/నర్సంపేట:

నర్సంపేట గంగ పుత్ర సంఘం అధ్యక్షు లు గుంటి సంజీవ ఆధ్వర్యంలో సమా వేశం నిర్వహించిన అనంతరం వారు మాట్లాడుతూ.. ముదిరాజ్ కులస్తులను తెలంగాణ ప్రభుత్వం బీసీ ఏ లో కలప డానికి చేస్తున్న ప్రయత్నాన్ని తీవ్రంగా వ్యతిరేకించారు. బీసీ ఏ లో ఉన్న కులా లు వెనుకబడి ఉన్నారని ఉపాధి లేక జీవనోపాధి కరువై ఇబ్బందులు ఎదు ర్కొంటున్నారని, సంపన్న వర్గానికి చెంది న ముదిరాజులను కలపడం వలన మాకు అన్యాయం జరుగుతుందని ఆవేద న వ్యక్తం చేసారు. ప్రభుత్వం చేస్తున్న ప్రయత్నాలు మానుకోవాలని బీసీ ఏ కులస్తులకు న్యాయం చేయాలని కోరారు. ఈ సమావేశంలో ఉపాధ్యక్షులు ఎర్రబోయిన కిషన్, జీజుల సాగర్,బయ్య నారాయణ, పూస ఏకాంబరం, మేదర బోయిన సత్యనారాయణ, అంకాల సాంబయ్య, మల్లికార్జున్,మైస కుమార్ స్వామి, మేదరబోయిన శ్రీనివాస్, గుంటి శ్రీనివాస్, సందిరి దుర్గా స్వామి, కాపర బోయిన రమేష్, అంకాల సురేష్, అంబ టి రవి, తదితరులున్నారు.

ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డిని కలిసిన జిల్లా సుడా చైర్మన్,వైరా ఎమ్మెల్యే