Breaking News

రోడ్డు ప్రమాదంలో యువకుడు మృతి…

మన ప్రగతి న్యూస్/ నడికూడ:

రోడ్డు ప్రమాదంలో యువకుడు మృతి చెందిన ఘటన నడికూడ మండల కేం ద్రంలోని రామకృష్ణాపూర్ – కంఠాత్మ కూర్ గ్రామాల మధ్య రోడ్డు ప్రమాదం చోటుచేసుకుంది. స్థానికుల సమాచారం మేరకు.. నడికూడ మండల కేంద్రా నికి చెందిన ఆకారపు సుధాకర్ కుమారుడు ఆకారపు క్రాంతి కుమార్ తన ద్విచక్ర వాహనం పై మంగళవారం మధ్యాహ్నం హనుమకొండ కు వెళ్లి తిరిగి సాయంత్రం 5:30 స్వగ్రామానికి బయలుదేరగా మార్గ మధ్యలో రామకృష్ణా పూర్ – కంఠాత్మకూర్ గ్రామాల మధ్య గల వ్యవసాయ భూములలో గుర్తు తెలియని వ్యక్తులు వారి పంట అవశేషాలను కాల్చగా.. ఆ మంటలు రోడ్డు వైపు అలుముకుని విపరీతమైన పొగతో రోడ్డు మొత్తం కమ్మేయడంతో ..అదే సమయంలో గుర్తు తెలియని బొలెరో వాహనం ఢీ కొట్టగా.. ద్విచక్ర వాహన దారుడు క్రాంతి కుమార్ అక్కడిక్కడే మృతి చెందినట్లు స్థానికులు తెలిపారు. స్థానికుల సమాచారంతో ఘటన స్థలానికి చేరుకున్న దామెర పోలీసులు దర్యా ప్తు చేపట్టారు. పోలీసుల విచారణలో పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది. ఈ సంఘటనతో గ్రామంలో విషాద ఛాయలు అలుముకున్నాయి. మృతుడికి వివాహం కాగా భార్య, కుమారుడు ఉన్నాడు.

గంగపుత్రులను అధికారికంగా గుర్తించాలి

మృతుడు ..ఆకారపు క్రాంతి కుమార్. (ఫైల్ ఫోటో)