Breaking News

ఆశ్రమ పాఠశాలను తనిఖీ చేసిన కలెక్టర్

మన ప్రగతి న్యూస్/ మహబూబాబాద్ బ్యూరో

మహబూబాబాద్ మండలం,
రెడ్యాల గ్రామం ఆశ్రమ ఉన్నత పాఠశాల ను జిల్లా కలెక్టర్ అద్వైత్ కుమార్ సింగ్ శనివారం రాత్రి పరిశీలించారు.
ఈ సందర్భంగా హాస్టల్లోని డైనింగ్ హాల్, స్టడీ రూమ్స్, టాయిలెట్స్, తదితర పరిసరాలను పరిశీలించారు.
విద్యార్థులకు రుచికరమైన భోజనం అందించాలని వార్డెన్ మోహన్ ను ఆదేశించారు.

జర్నలిస్టులకు వ్యక్తిగతంగానే ఇండ్ల స్థలాలు ఇచ్చేలా కృషి చేస్తాం: డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క


విద్యార్థులతో కలిసి మాట్లాడుతూ పట్టుదలతో చదివి ఉన్నత శిఖరాలకు చేరుకోవాలని విద్యార్థులకు సూచించారు.విద్య, ఆహారం, ఇతర సదుపాయాల గురించి అడిగి తెలుసుకున్నారు.