మన ప్రగతి న్యూస్/ ముస్తాబాద్
_ నాలుగు ద్విచక్ర వాహనాలు ఒక కారు ఆటో సీజ్
_ 9 మంది పై కేసు నమోదు
రాజన్న సిరిసిల్ల ముస్తాబాద్ మండలంలో రామ లక్ష్మణ పల్లె గ్రామంలో 9 మంది వ్యక్తులు పేకాట ఆడుతూ పట్టు పడగా వారిపై కేసు నమోదు చేసినట్లు ఎస్సై గణేష్ తెలిపారు. వారి వివరాల ప్రకారం రామ లక్ష్మణ పల్లె గ్రామ శివారులో 9 మంది వ్యక్తులు పేకాట ఆడుతున్నట్లు సమాచారం వచ్చింది. ఎస్సై తన సిబ్బంది యుక్తంగా వెళ్లి తనిఖీ చేయగా 13,340/- రూపాయల నగదు తోపాటు నాలుగు ద్విచక్ర వాహనాలు ఒక కారు, ఆటోను సీజ్ చేసి తొమ్మిది మంది పైన కేసు నమోదు చేసినట్లు ఎస్సై తెలిపారు.