ఎస్సై దూలం పవన్ కుమార్
మనప్రగతిన్యూస్/పాలకుర్తి నియోజకవర్గం ప్రతినిధి:
ఎలాంటి అనుమతులు లేకుండా ఇసుకను తరలిస్తే కఠిన చర్యలు తప్పవని ఎస్ఐ దూలం పవన్ కుమార్ అన్నారు. మంగళవారం జనగామ జిల్లా పాలకుర్తి మండలంలోని చెన్నూరు గ్రామ శివారులో ఎలాంటి అనుమతులు లేకుండా అక్రమంగా ఇసుకను తరలిస్తున్న 4 ట్రాక్టర్లను సీజ్ చేసి పోలీస్ స్టేషన్ కు తరలించిన ఎస్ఐ దూలం పవన్ కుమార్ తెలిపారు
