Breaking News

ఫోక్సో కేసు నిందితుడు బండి సాయి భగీరథను వెంటనే అరెస్టు చేయాలిమన ప్రగతి న్యూస్/ గుండాల ప్రతినిధి:ఫోక్సో కేసు నిందితుడు,కేంద్ర మంత్రి బండి సంజయ్ కుమారుడు బండి సాయి భగీరథను వెంటనే అరెస్టు చేసి బాధితురాలికి సత్వర న్యాయం చెయ్యాలని సిపిఎం యాదాద్రి భువనగిరి జిల్లా కమిటీ సభ్యులు మద్దెపురం రాజు రాష్ట్ర ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు.గురువారం గుండాలలో విలేకరులతో మాట్లాడుతూ నిందుతునిపై పోక్సో చట్టం క్రింద కేసు నమోదయి ఐదారు రోజులు దాటినా ఇప్పటి వరకు అరెస్టు చేయకపోవడం దుర్మార్గమైన చర్య అన్నారు.17 యేళ్ళ మైనర్ బాధితురాలు కుటుంబ సభ్యులు ఫిర్యాదు చేయడానికి వెళ్తే,పోలీసులు వ్యవహరించిన తీరు అత్యంత దారుణంగా ఉందని విమర్శించారు.బాధితులను స్టేషన్లోనే ఉంచి ఆ సమాచారాన్ని నిందితులకు చేరవేశారని ఆరోపించారు. నిందితులు కరీంనగర్లో బాధితురాలిపై హానీ ట్రాప్ కేసు పెట్టే వరకు వేచిచూసి,ఆ తరువాతే ఫిర్యాదు స్వీకరించడం చూస్తుంటే చట్టం పలుకుబడి గల వారి చుట్టంగా మారిందనే అర్ధం అవుతుందని అన్నారు.భేటీ బచావో అంటూ గొప్పలు చెప్పుకునే బీజేపీ నేతలు దీనికి ఏం సమాధానం చెప్తారని ప్రశ్నించారు.బీజేపీ నాయకుల నుంచే మహిళలకు,బాలికలకు రక్షణ లేకుండా పోయిందని ఆవేదన వ్యక్తం చేశారు.గతంలో దేశాన్ని కుదిపేసిన ఉత్తరప్రదేశ్ హత్రాస్ ఘటన వల్లయోధులపై బీజేపీ ఎంపీ బ్రజ్ భూషణ్ సింగ్ కేసుల్లో బీజేపీ ప్రభుత్వం ఎలాగైతే నిందుతులను కాపాడే ప్రయత్నం చేసిందో,ఇప్పుడు అదే దోరణి కనిపిస్తుందని పేర్కొన్నారు.బాధితురాలికి అండగా నిలవాల్సిన ప్రభుత్వం,పోలీసులు నిందుతులకు కొమ్ము కాయడం సరికాదని,ఇప్పటికైనా రాజకీయ వత్తిళ్లకు తలొగ్గకుండా నిందుతుణ్ణి వెంటనే అరెస్టు చేసి,బాధిత కుటుంబానికి రక్షణ కల్పించాలని డిమాండ్ చేశారు.

బాలల దినోత్సవం వేడుకలో పాల్గొన్న జుక్కల్ ఎమ్మెల్యే తోట లక్ష్మీ కాంతారావు దంపతులు

మన ప్రగతి న్యూస్/ పిట్లం:

పెద్ద కొడప్గల్ మండల కేంద్రంలోని ప్రభుత్వ పాఠశాలలో గురువారం బాలల దినోత్సవం వేడుకల్లో జుక్కల్ ఎమ్మెల్యే తోట లక్ష్మీ కాంతారావు దంపతులు పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే స్వాతంత్ర్య సమరయోధులు నవభారత నిర్మాత భారత దేశ తొలి ప్రధానమంత్రి పండిట్ జవహర్ లాల్ నెహ్రూ జయంతి సందర్భంగా వారి చిత్ర పటానికి పూలమాల వేసి నివాళులు అర్పించారు. బాలల దినోత్సవం సందర్భంగా ఎమ్మెల్యే విద్యార్థులకు శుభాకాంక్షలు తెలియజేశారు.పండిట్ జవహర్ లాల్ నెహ్రూ జయంతి రోజున బాలల దినోత్సవం జరుపుకుంటాం కాబట్టి మనమందరం వారి ఆశయ సాధన కోసం కృషి చేయాలని పిలుపునిచ్చారు.
కుల,మత,వర్గ బేధాలు లేకుండా విద్యార్థులు అందరూ సోదర భావంతో మెలగాలని సూచించారు.
దేశ భవిష్యత్తు తరగతి గదిలో నిర్మాణం జరుగుతుంది
కాబట్టి విద్యార్థులను ఉత్తమ పౌరులుగా తీర్చిదిద్దడంలో ఉపాధ్యాయుల పాత్ర చాలా కీలకమని అన్నారు.బాలల్ని సక్రమ మార్గంలో నడిచేలా చేస్తే దేశం కూడా అదే బాటలో పయనిస్తుందనడంలో సందేహం లేదని తెలిపారు.నేటి బాలలే రేపటి పౌరులు కాబట్టి వారి హక్కులను కాపాడటం, బాధ్యత గల పౌరులుగా వారిని తీర్చిదిద్దడం మన బాధ్యత అని అన్నారు.
బాలల హక్కులను కాపాడేందుకు సంకల్పం చేద్దాం. సామాజిక, ఆర్ధిక బలహీనతలు బాలల దరికి చేరకుండా వారికి మంచి భవిష్యత్ ను అందిద్దామన్నారు. ఈ కార్యక్రమంలో ఎమ్మెల్యే సతీమణి అర్చన, మండల కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు మహేందర్ రెడ్డి, కాంగ్రెస్ పార్టీ నాయకులు మల్లప్ప పటేల్, ఉపాధ్యాయులు, నాయకులు పాల్గొన్నారు .

ఫోక్సో కేసు నిందితుడు బండి సాయి భగీరథను వెంటనే అరెస్టు చేయాలిమన ప్రగతి న్యూస్/ గుండాల ప్రతినిధి:ఫోక్సో కేసు నిందితుడు,కేంద్ర మంత్రి బండి సంజయ్ కుమారుడు బండి సాయి భగీరథను వెంటనే అరెస్టు చేసి బాధితురాలికి సత్వర న్యాయం చెయ్యాలని సిపిఎం యాదాద్రి భువనగిరి జిల్లా కమిటీ సభ్యులు మద్దెపురం రాజు రాష్ట్ర ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు.గురువారం గుండాలలో విలేకరులతో మాట్లాడుతూ నిందుతునిపై పోక్సో చట్టం క్రింద కేసు నమోదయి ఐదారు రోజులు దాటినా ఇప్పటి వరకు అరెస్టు చేయకపోవడం దుర్మార్గమైన చర్య అన్నారు.17 యేళ్ళ మైనర్ బాధితురాలు కుటుంబ సభ్యులు ఫిర్యాదు చేయడానికి వెళ్తే,పోలీసులు వ్యవహరించిన తీరు అత్యంత దారుణంగా ఉందని విమర్శించారు.బాధితులను స్టేషన్లోనే ఉంచి ఆ సమాచారాన్ని నిందితులకు చేరవేశారని ఆరోపించారు. నిందితులు కరీంనగర్లో బాధితురాలిపై హానీ ట్రాప్ కేసు పెట్టే వరకు వేచిచూసి,ఆ తరువాతే ఫిర్యాదు స్వీకరించడం చూస్తుంటే చట్టం పలుకుబడి గల వారి చుట్టంగా మారిందనే అర్ధం అవుతుందని అన్నారు.భేటీ బచావో అంటూ గొప్పలు చెప్పుకునే బీజేపీ నేతలు దీనికి ఏం సమాధానం చెప్తారని ప్రశ్నించారు.బీజేపీ నాయకుల నుంచే మహిళలకు,బాలికలకు రక్షణ లేకుండా పోయిందని ఆవేదన వ్యక్తం చేశారు.గతంలో దేశాన్ని కుదిపేసిన ఉత్తరప్రదేశ్ హత్రాస్ ఘటన వల్లయోధులపై బీజేపీ ఎంపీ బ్రజ్ భూషణ్ సింగ్ కేసుల్లో బీజేపీ ప్రభుత్వం ఎలాగైతే నిందుతులను కాపాడే ప్రయత్నం చేసిందో,ఇప్పుడు అదే దోరణి కనిపిస్తుందని పేర్కొన్నారు.బాధితురాలికి అండగా నిలవాల్సిన ప్రభుత్వం,పోలీసులు నిందుతులకు కొమ్ము కాయడం సరికాదని,ఇప్పటికైనా రాజకీయ వత్తిళ్లకు తలొగ్గకుండా నిందుతుణ్ణి వెంటనే అరెస్టు చేసి,బాధిత కుటుంబానికి రక్షణ కల్పించాలని డిమాండ్ చేశారు.