Breaking News

ఫోక్సో కేసు నిందితుడు బండి సాయి భగీరథను వెంటనే అరెస్టు చేయాలిమన ప్రగతి న్యూస్/ గుండాల ప్రతినిధి:ఫోక్సో కేసు నిందితుడు,కేంద్ర మంత్రి బండి సంజయ్ కుమారుడు బండి సాయి భగీరథను వెంటనే అరెస్టు చేసి బాధితురాలికి సత్వర న్యాయం చెయ్యాలని సిపిఎం యాదాద్రి భువనగిరి జిల్లా కమిటీ సభ్యులు మద్దెపురం రాజు రాష్ట్ర ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు.గురువారం గుండాలలో విలేకరులతో మాట్లాడుతూ నిందుతునిపై పోక్సో చట్టం క్రింద కేసు నమోదయి ఐదారు రోజులు దాటినా ఇప్పటి వరకు అరెస్టు చేయకపోవడం దుర్మార్గమైన చర్య అన్నారు.17 యేళ్ళ మైనర్ బాధితురాలు కుటుంబ సభ్యులు ఫిర్యాదు చేయడానికి వెళ్తే,పోలీసులు వ్యవహరించిన తీరు అత్యంత దారుణంగా ఉందని విమర్శించారు.బాధితులను స్టేషన్లోనే ఉంచి ఆ సమాచారాన్ని నిందితులకు చేరవేశారని ఆరోపించారు. నిందితులు కరీంనగర్లో బాధితురాలిపై హానీ ట్రాప్ కేసు పెట్టే వరకు వేచిచూసి,ఆ తరువాతే ఫిర్యాదు స్వీకరించడం చూస్తుంటే చట్టం పలుకుబడి గల వారి చుట్టంగా మారిందనే అర్ధం అవుతుందని అన్నారు.భేటీ బచావో అంటూ గొప్పలు చెప్పుకునే బీజేపీ నేతలు దీనికి ఏం సమాధానం చెప్తారని ప్రశ్నించారు.బీజేపీ నాయకుల నుంచే మహిళలకు,బాలికలకు రక్షణ లేకుండా పోయిందని ఆవేదన వ్యక్తం చేశారు.గతంలో దేశాన్ని కుదిపేసిన ఉత్తరప్రదేశ్ హత్రాస్ ఘటన వల్లయోధులపై బీజేపీ ఎంపీ బ్రజ్ భూషణ్ సింగ్ కేసుల్లో బీజేపీ ప్రభుత్వం ఎలాగైతే నిందుతులను కాపాడే ప్రయత్నం చేసిందో,ఇప్పుడు అదే దోరణి కనిపిస్తుందని పేర్కొన్నారు.బాధితురాలికి అండగా నిలవాల్సిన ప్రభుత్వం,పోలీసులు నిందుతులకు కొమ్ము కాయడం సరికాదని,ఇప్పటికైనా రాజకీయ వత్తిళ్లకు తలొగ్గకుండా నిందుతుణ్ణి వెంటనే అరెస్టు చేసి,బాధిత కుటుంబానికి రక్షణ కల్పించాలని డిమాండ్ చేశారు.

జాతీయస్థాయి పోటీలకు ఎంపికైన వేదం స్కూల్ విద్యార్థులు

మనప్రగతి న్యూస్ / నిర్మల్

ఇంటర్ డిస్టిక్ సబ్ జూనియర్ ఉసు ఛాంపియన్షిప్ 2024 వేదం విద్యార్థుల ప్రతిభ హైదరాబాద్లోని హస్తినాపురంలో భవిష్య ఇంటర్నేషనల్ స్కూల్లో జరిగిన ఇంటర్ ది డిస్టిక్ సబ్ జూనియర్ వేదం గ్లోబల్ స్కూల్ నిర్మల్ చెందిన అండర్ 12 క్యాటగిరీలో అనన్య ఉత్తమ ప్రతిభను కనబరిచి గోల్డ్ మెడల్ ని సాధించింది. అంతేకాకుండా అండర్ 14 క్యాటగిరీలో శృతి ప్రియ మరియు ఆయుష్ ఉత్తమ ప్రతిభను కనబరిచి గోల్డ్ మెడల్ ని సాధించారు. అదేవిధంగా ఉత్తమ ప్రతిభను కనబరిచి గోల్డ్ మెజర్ సాధించారు వీళ్లు డిసెంబర్ 1 నుండి 6వ తేదీన పంజాబ్లోని చుంబన్ డిస్ట్రిక్ట్ లో జరిగే జాతీయస్థాయిలో పాల్గొంటారని నిర్వాహకులు తెలియజేశారు. అంతేకాకుండా అండర్ 12 మరియు 14 క్యాటగిరీలో వేదం గ్లోబల్ స్కూల్ కి చెందిన లాస్య 7వ తరగతి ,చరణ్ 5వ తరగతి క్లాస్, మణికర్తిక్ 6వ తరగతి తనుశ్రీ 7వ తరగతి , వైష్ణవి, వర్షిత్ కే, కృష్ణ, మనస్విని, స్వీకృతిలో ఉత్తమ ప్రతిభ కనబరిచి సిల్వర్ మెడలను సాధించారు. అంతేకాకుండా లిఖిత, ప్రసన్న, అన్విత, సృజై, అసిఫ్, కాంసా పథకాలను సాధించారు. సుమారుగా 700 మంది విద్యార్థులు పాల్గొన్న ఈ పోటీలో మన నిర్మల్ నుండి మూడు గోల్డ్ ఆరు సిల్వర్ మరియు ఏడు కంసా పథకాలను సాధించి రాష్ట్రంలోనే ఛాంపియన్గా నిలిచారు. వీళ్ళ కోచ్ అయినటువంటి సాయినాథ్ ని నిర్వాహకులు ప్రత్యేకంగా అభినందించారు. మీ ఈ విద్యార్థులకు నిర్మల్ జిల్లా ఎస్పీ జానకి షర్మిల నిర్మల్ డిస్ట్రిక్ట్ రాష్ట్రంలోనే ఉత్తమం ప్రతిమ కనబరిచినందుకు విద్యార్థులను ప్రత్యేకంగా అభినందించారు. అంతేకాకుండా భవిష్యత్తులో కూడా అనేక అవాంతరాలను ఎదుర్కొని ఉన్నత శిఖరాలను చేరుకోవాలని పిల్లలతో తన అనుభవాలను పంచుకున్నారు.

బావిలో దూకి యువకుడు ఆత్మహత్య