Breaking News

ఫోక్సో కేసు నిందితుడు బండి సాయి భగీరథను వెంటనే అరెస్టు చేయాలిమన ప్రగతి న్యూస్/ గుండాల ప్రతినిధి:ఫోక్సో కేసు నిందితుడు,కేంద్ర మంత్రి బండి సంజయ్ కుమారుడు బండి సాయి భగీరథను వెంటనే అరెస్టు చేసి బాధితురాలికి సత్వర న్యాయం చెయ్యాలని సిపిఎం యాదాద్రి భువనగిరి జిల్లా కమిటీ సభ్యులు మద్దెపురం రాజు రాష్ట్ర ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు.గురువారం గుండాలలో విలేకరులతో మాట్లాడుతూ నిందుతునిపై పోక్సో చట్టం క్రింద కేసు నమోదయి ఐదారు రోజులు దాటినా ఇప్పటి వరకు అరెస్టు చేయకపోవడం దుర్మార్గమైన చర్య అన్నారు.17 యేళ్ళ మైనర్ బాధితురాలు కుటుంబ సభ్యులు ఫిర్యాదు చేయడానికి వెళ్తే,పోలీసులు వ్యవహరించిన తీరు అత్యంత దారుణంగా ఉందని విమర్శించారు.బాధితులను స్టేషన్లోనే ఉంచి ఆ సమాచారాన్ని నిందితులకు చేరవేశారని ఆరోపించారు. నిందితులు కరీంనగర్లో బాధితురాలిపై హానీ ట్రాప్ కేసు పెట్టే వరకు వేచిచూసి,ఆ తరువాతే ఫిర్యాదు స్వీకరించడం చూస్తుంటే చట్టం పలుకుబడి గల వారి చుట్టంగా మారిందనే అర్ధం అవుతుందని అన్నారు.భేటీ బచావో అంటూ గొప్పలు చెప్పుకునే బీజేపీ నేతలు దీనికి ఏం సమాధానం చెప్తారని ప్రశ్నించారు.బీజేపీ నాయకుల నుంచే మహిళలకు,బాలికలకు రక్షణ లేకుండా పోయిందని ఆవేదన వ్యక్తం చేశారు.గతంలో దేశాన్ని కుదిపేసిన ఉత్తరప్రదేశ్ హత్రాస్ ఘటన వల్లయోధులపై బీజేపీ ఎంపీ బ్రజ్ భూషణ్ సింగ్ కేసుల్లో బీజేపీ ప్రభుత్వం ఎలాగైతే నిందుతులను కాపాడే ప్రయత్నం చేసిందో,ఇప్పుడు అదే దోరణి కనిపిస్తుందని పేర్కొన్నారు.బాధితురాలికి అండగా నిలవాల్సిన ప్రభుత్వం,పోలీసులు నిందుతులకు కొమ్ము కాయడం సరికాదని,ఇప్పటికైనా రాజకీయ వత్తిళ్లకు తలొగ్గకుండా నిందుతుణ్ణి వెంటనే అరెస్టు చేసి,బాధిత కుటుంబానికి రక్షణ కల్పించాలని డిమాండ్ చేశారు.

వికారాబాద్ జిల్లా లగచర్ల ఘటన: చర్లపల్లి జైలులో బీఆర్ఎస్ నేతల మద్దతు

మనప్రగతి న్యూస్ మేడ్చల్ మల్కాజ్గిరి ప్రతినిధి:-

వికారాబాద్ జిల్లా లగచర్లలో కలెక్టర్, మరియూ అధికారులపై దాడి కుట్ర కేసులో అరెస్టై, ప్రస్తుతం చర్లపల్లి జైలులో రిమాండ్ ఖైదీగా ఉన్న కొడంగల్ బీఆర్ఎస్ పార్టీ మాజీ ఎమ్మెల్యే పట్నం నరేందర్ రెడ్డిని బీఆర్ఎస్ నేతలు పరామర్శించారు. నిన్న నరేందర్ రెడ్డిని మద్దతుగా, మాజీ మంత్రి, సిద్దిపేట శాసన సభ్యులు తన్నీరు హరీష్ రావు చర్లపల్లి జైలుకు చేరుకుని ఆయనతో ములాఖాత్ చేశారు.ఈ సందర్బంగా హరీష్ రావుతో పాటు పార్టీ బీఆర్ఎస్ ఎమ్మెల్యేలు బండారి లక్ష్మారెడ్డి, పల్లా రాజేశ్వర్ రెడ్డి, సీనియర్ నాయకులు కార్తీక్ రెడ్డి, నందికంటి శ్రీధర్ తదితరులు నరేందర్ రెడ్డితో సమావేశమయ్యారు.
ఈ సందర్భంగా భారీ సంఖ్యలో బీఆర్ఎస్ పార్టీ నాయకులు, కార్యకర్తలు కూడా చర్లపల్లి జైలుకు తరలి వచ్చారు.
హరీష్ రావు మాట్లాడుతూ, పట్నం నరేందర్ రెడ్డికి ఈ కుట్ర కేసుతో ఎలాంటి సంబంధం లేదని, బీఆర్ఎస్ పార్టీపై అక్రమ కేసులు పెట్టడం కొత్తకాదని అన్నారు. “ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డిపై ప్రజా వ్యతిరేకత కొడంగల్ నుండే ప్రారంభమవుతోంది,” అంటూ ఆయన వ్యాఖ్యానించారు. బీఆర్ఎస్ పార్టీ పట్ల జరుగుతున్న అన్యాయం మరియు ప్రజల భూముల విషయంలో ప్రభుత్వం తగిన విధంగా స్పందించకపోవడం బాధాకరమని అన్నారు.

చెరువులో పడి మహిళ మృతి