Breaking News

ప్రజలు అప్రమత్తంగా ఉండాలి. ఎస్సై బి శ్రావణ్ కుమార్.

మన ప్రగతి న్యూస్/లింగాల గణపురం.

లింగాల గణపురం మండలం రాష్ట్రవ్యాప్తంగా కురుస్తున్న తుఫాను ప్రభావం మూడు నాలుగు రోజులపాటు ఉండే అవకాశం ఉందా అని వాతావరణ శాఖ హెచ్చరికలు జారీ చేసిన నేపథ్యంలో ప్రజలు అప్రమత్తంగా ఉండాలి వర్షాల సమయంలో అత్యవసర పరిస్థితులు తప్ప దూర ప్రయాణాలు వాయిదా వేసుకోవాలి. వరద ముంపు ప్రాంతాలు నీటి వాగు వంకలు దాటకుండా జాగ్రత్తలు పాటించాలి. చిన్నపిల్లలు వృద్ధులు గర్భిణీ స్త్రీలు వర్ష సమయంలో బయట తిరగకుండా ఇంట్లోనే ఉండాలి. ఎవరైనా ఇబ్బందుల్లో ఉన్నప్పుడు తక్షణమే స్థానిక అధికారులను సంప్రదించాలి. ప్రతి పౌరుడు తన పరిధిలో ప్రజలకు అందుబాటులో ఉండాలి వర్షాల కారణంగా సమస్యలు ఎదుర్కొంటున్న వారిని వెంటనే సహాయము అందించాలి అవసరమైతే ప్రభుత్వం స్థానిక సంస్థలతో సమన్వయం చేసి సహాయక చర్యలు చేపట్టాలి
వర్ష ప్రభావాన్ని దృష్టిలో పెట్టుకొని ప్రతి ఒక్కరు జాగ్రత్తలు పాటించాలని తెలిపారు.

ఇంటర్మీడియట్ పరీక్ష కేంద్రాల వద్ద కఠిన నిషేధాజ్ఞలు..