Breaking News

భారీ వర్షాల కారణంగా ప్రజలు అప్రమత్తంగా ఉండాలి

. రామన్నపేట ఎస్ ఐ డి.నాగరాజు

మన ప్రగతి న్యూస్/రామన్నపేట:

నడికూడ మండల నూతన ప్రెస్ క్లబ్ ఏకగ్రీవ ఎన్నిక..

మొంథా తుపాన్ తీవ్రత ద్రుష్ట ప్రజలు అప్రమత్తంగా ఉండాలని ఎస్ ఐ డి. నాగరాజు తెలిపారు.ఒక ప్రకటనలో మాట్లాడుతూ గ్రామాలలో చెరువులు, కుంటలు నిండుకుండలా ఉన్నాయి కనుక జాగ్రత్తగా వుండాలని,వాగులు దాటి ప్రయాణం చేయవద్దని,రోడ్ల పై ప్రయాణించే సమయం లో ప్రత్యేక జాగ్రత్తలు పాటించాలని,లోతట్టు ప్రాంతాల ప్రజలు అత్యవసర పరిస్థితి లో తప్ప బయటకు రావద్దని,కరెంటు స్థంబాలు, వైర్లు ముట్టుకోవద్దని మరియు పశువులను కూడా వర్షాలకు బయటకు వదలకుండా చూడాలని,చిన్నారులు, వృద్దులు,మహిళలు,బయటకు రావదద్దని,మూసి పరివాహక ప్రాంతాలలోని ప్రజలు మూసి నదిలోనికి పశువులని గాని,చేపలు పట్టడానికి గాని ఎవ్వరు వెళ్ళవద్దని,ధాన్యం కొనుగోలు కేంద్రాలలో ధాన్యం తడువకుండా టార్పాలిన్ కప్పి సంరక్షించుకోవాలని, అత్యవసర పరిస్థితిలో పోలీసులను 100 లేదా 112, 8712662809 నంబర్ల ద్వారా గాని రామన్నపేట పోలీస్ స్టేషన్ లో సంప్రదించగలరని తెలిపారు.