Breaking News

రేపు గ్రీవెన్స్ రద్దు-పాఠశాలలకు సెలవు

ప్రభుత్వ,స్థానిక సంస్థల మరియు ప్రైవేట్ యాజమాన్యాల పాఠశాలలకు సెలవు

మన ప్రగతి న్యూస్ / యాదాద్రి భువనగిరి ప్రతినిధి:

నడికూడ మండల నూతన ప్రెస్ క్లబ్ ఏకగ్రీవ ఎన్నిక..

భారీ వర్షాలు కురుస్తున్న నేపథ్యంలో ప్రతి గురువారం ప్రజల సమస్యలను పరిష్కరించే గ్రీవెన్స్ కార్యక్రమంను రద్దు చేయడం జరిగిందని యాదాద్రి భువనగిరి జిల్లా కలెక్టర్ హనుమంత రావు నేడొక ప్రకటనలో తెలిపారు.కావున జిల్లాలోని ప్రజలు భారీ వర్షాలు కురుస్తున్నందున,ప్రజలు కలెక్టరేట్ కు వచ్చి ఇబ్బందులు పడవద్దనే ఉద్దేశంతో ఈ గ్రీవెన్స్ ను రద్దు చేయడం జరిగిందని,తదుపరి వచ్చే గురువారం గ్రీవెన్స్ యధాతధంగా ఉంటుందని అన్నారు.భారీ వర్షాల కారణంగా జిల్లా కలెక్టర్ ఆదేశానుసారం రేపు ప్రభుత్వ,స్థానిక సంస్థల మరియు ప్రైవేట్ యాజమాన్యాల పాఠశాలలకు సెలవు ప్రకటించనైనదని జిల్లా విద్యాశాఖ అధికారి తెలియజేశారు.