మొంథా తఫాన్ ప్రభావంతో కూలిన ఇల్లు
మనప్రగతి న్యూస్ /నెక్కొండ :
నెక్కొండ మండలంలోని సాయిరెడ్డి పల్లి గ్రామనికి చెందిన పొదిల జయప్రకాశ్, మౌనికలు నివసిస్తున్న పెంకటిల్లు మొంథా తుఫాన్ ప్రభావంతో ఇంటి చుట్టూ నీరు చేరి గోడలు వర్షానికి నాని అర్థ రాత్రి ఇల్లు కూలడం జరిగింది. వారు నిద్రిస్తున్న సమయంలో పెద్దగా శబ్దం రావడంతో హడావిడిగా బయటికి వచ్చి చూడగా గోడ కూలడం జరిగింది. ఈ విషయాన్ని గమనించి భయభ్రాంతులకు గురై నిద్రిస్తున్న తమ ఇద్దరి పిల్లలను తీసుకొని హడావిడిగా బయటికి రావడం జరిగింది. జయప్రకాష్ మాట్లాడుతూ.. ఆ సమయంలో నాకు నిద్ర నుండి మేలుకువ రాకపోతే ఈ పాటికి మా కుటుంబం మొత్తం జీవించి ఉండకపోయేది. కనుక ఈ విషయాన్ని అధికారులు, ప్రభుత్వం గుర్తించి ప్రస్తుతం ఉండడానికి నివాసాన్ని ఏర్పాటు చేసి, ఆర్థికంగా సహాయం చేసి మా కుటుంబాన్ని ఆదుకోవల్సిందిగా కోరుచున్నాము. అని తెలపడం జరిగింది. ఈ బాధాకర ఘటనకు గ్రామస్తులు కూడా చింతించడం జరిగింది.

