Breaking News

మూల పోచారం ఆశ్రమ పాఠశాలను తనిఖీ చేసిన వైరా ఏటిడిఓ

మూల పోచారం ఆశ్రమ పాఠశాలను తనిఖీ చేసిన వైరా ఏటిడిఓ

మన ప్రగతి న్యూస్ /ఏన్కూర్ ఏన్కూర్

మండలంలోని మూల పోచారం ప్రభుత్వ గిరిజన ఆశ్రమ ఉన్నత పాఠశాలను వైరా గిరిజన సంక్షేమ అభివృద్ధి అధికారి (ఏటిడిఓ) పి. రమేష్, పూర్వ వైరా ఏటిడిఓ యస్. రాధా గురువారం ఆకస్మికంగా తనిఖీ చేశారు.ఈ సందర్భంగా అధికారులు సమ్మేటివ్ అసెస్మెంట్ – 1 పరీక్షల నిర్వహణను పరిశీలించి, విద్యార్థుల హాజరు, పాఠశాల నిర్వహణపై వివరాలు సేకరించారు. మధ్యాహ్న భోజన సమయంలో విద్యార్థులకు అందిస్తున్న భోజనాన్ని రుచి చూసి మెనూ అమలును పరిశీలించారు. అనంతరం పాఠశాల పరిసరాలు, స్టోర్ రూమ్, నిత్యవసర సరుకుల నిల్వ, స్టాక్ రికార్డులు, పాఠశాల రికార్డులను పరిశీలించి సంతృప్తి వ్యక్తం చేశారు.తదుపరి ఉపాధ్యాయులతో సమావేశం నిర్వహించిన ఏటిడిఓ పి. రమేష్ గారు, గిరిజన విద్యార్థుల విద్యా ప్రమాణాలను మరింతగా పెంచేందుకు అందరూ సమిష్టిగా కృషి చేయాలని సూచించారు. గత విద్యా సంవత్సరంలో 100 శాతం ఫలితాలు సాధించిన ఉపాధ్యాయ సిబ్బందిని అభినందించి, ఈ సంవత్సరం కూడా అదే స్థాయిలో ప్రతిష్ఠాత్మక ఫలితాలు సాధించాలని కోరారు.ఈ కార్యక్రమంలో పాఠశాల ప్రధానోపాధ్యాయులు జి. నాగరాజు, డిప్యూటీ వార్డెన్ బి. రవి, సీనియర్ ఉపాధ్యాయులు డి.ఎస్. నాగేశ్వరరావు, ఉపాధ్యాయులు బి. శోభన్, బి. రవి, వి. రమేష్, ఏ. సుస్మిత, ఎం. చంద్రరావు, జె. నాగేశ్వరరావు, డి. ఉషశ్రీ, టి. హర్యానాయక్, ఏ.యన్.యం. సౌందర్య తదితరులు పాల్గొన్నారు.

ఇంటర్మీడియట్ పరీక్ష కేంద్రాల వద్ద కఠిన నిషేధాజ్ఞలు..