Breaking News

పోలీస్‌ అమరవీరుల స్మరణలో ఫూట్‌ ర్యాలీ

మన ప్రగతి న్యూస్ /కాప్రా ప్రతినిధి

పోలీస్‌ అమరవీరుల సంస్మరణ వారోత్సవాల్లో భాగంగా కుషాయిగూడ‌ ట్రాఫిక్‌ పోలీసు అధికారులు గురువారం ఫూట్‌ ర్యాలీ నిర్వహించారు. ఈ ర్యాలీ ఈసీఐఎల్‌ ఎక్స్‌రోడ్డు నుంచి తాళ్లూరి ఎక్స్‌రోడ్డు వరకు సాగింది. దాదాపు 90 మంది కళాశాల విద్యార్థులు, ప్రజలు ఉత్సాహంగా పాల్గొన్నారు. తాళ్లూరి ఎక్స్‌రోడ్డుకు చేరుకున్న అనంతరం అమరవీరులకు ఒక నిమిషం మౌనం పాటించి నివాళులర్పించారు. ఈ సందర్భంగా ట్రాఫిక్‌ ఇన్‌స్పెక్టర్‌ ఎన్‌. రామలక్ష్మణరాజు మాట్లాడుతూ పోలీస్‌ అమరవీరుల త్యాగాలు ప్రతి ఒక్కరికి స్ఫూర్తిదాయకమని అన్నారు. అలాగే విద్యార్థులకు ట్రాఫిక్‌ నియమాల ప్రాముఖ్యతను వివరించారు. ఈ కార్యక్రమాన్ని ఎస్‌హెచ్‌ఓ రామలక్ష్మణరాజు, ఎస్‌ఐలు జి. మధు, లింగారెడ్డి, భాస్కర్‌లతో కలిసి విజయవంతంగా నిర్వహించారు.

ఇంటర్మీడియట్ పరీక్ష కేంద్రాల వద్ద కఠిన నిషేధాజ్ఞలు..