Breaking News

అంత్యక్రియలకు ఆర్థిక సహాయం

మన ప్రగతి న్యూస్ / వనపర్తి ప్రతినిధి

వనపర్తి జిల్లా కొత్తకోట పట్టణం 11వ వార్డుకు చెందిన జనంపల్లి అశోక్ మృతిచెందగా విషయం తెలుసుకున్న “జె.ఎస్. రాములు ఫౌండేషన్” స్వచ్ఛంద సేవా సంస్థ నిర్వాహకులు మృతుడి కుటుంబ సభ్యులను పరామర్శించి, పూలమాలతో నివాళులర్పించారు. అనంతరం అంత్యక్రియల నిమిత్తం మూడు వేల రూపాయలు ఆర్థిక సహాయం అందజేయడం జరిగింది.ఈ కార్యక్రమంలో జెఎస్ఆర్ ఫౌండేషన్ నిర్వాహకులు, ఉపాధ్యాయులు జే. భక్తరాజు, జె.సతీష్ రాజు, శ్యామ్ కుమార్, జె. కర్ణ కుమార్, దైవ సేవకులు ఇమ్మానియేలు, మున్సిపల్ మాజీ కోఆప్షన్ సభ్యులు మిషేక్,జె.కృపన్న,జే.రమేష్, జె. శ్రావణ్ తదితరులు పాల్గొన్నారు.

ఇంటర్మీడియట్ పరీక్ష కేంద్రాల వద్ద కఠిన నిషేధాజ్ఞలు..