Breaking News

జీవన మార్గానికై భగవద్గీత

-ధైర్యానికై హనుమాన్ చాలీసా దోహదపడతాయి

  • గవర్నర్ – జిష్ణుదేవ్ వర్మ

మన ప్రగతి న్యూస్/భూదాన్ పోచంపల్లి:

ఇంటర్మీడియట్ పరీక్ష కేంద్రాల వద్ద కఠిన నిషేధాజ్ఞలు..

జీవన మార్గానికై భగవద్గీత, ధైర్యంతో ముందుకు సాగడానికి హనుమాన్ చాలీ సా మానవాళికి ఎంతగానో ఉపయోగపడతాయని రాష్ట్ర గవర్నర్ జిష్ణు దేవ్ వర్మ అన్నారు. గవర్నర్ గురువారం నాడు యాదాద్రి భువనగిరి జిల్లా- భూదాన్ పోచం పల్లి మండల పరిధిలోని పిలాయి పల్లి గ్రామ శివారులో గల సప్తపర్ని గోశాలను సందర్శించారు.ఈ సందర్భంగా గవర్నర్ ను గోశాల వారు, వేద పండితులు పూర్ణ కుంభంతో స్వాగతించారు. గవర్నర్ ఇక్కడ జ్యోతి ప్రజ్వలన చేసి, గోమాత, స్పటి క శివలింగం పూజా కార్య క్రమాల్లో పాల్గొన్నారు. అనంతరం బ్రెయిలీ లిపి లోకి మార్చిన భగవద్గీత, హనుమాన్ చాలీసా పుస్తకాలను ఆవిష్కరించారు. అనంతరం గవర్నర్ మాట్లాడుతూ హైందవ ధర్మంలో ఉండే ఈ పుస్తకాలను బ్రెయిలీ లిపి లోకి మార్చడం అందులు చదువుకునేలా చేయడం, ఇక్కడ ప్రకృతిని కాపాడ డం ఎంతైనా అభినందనీయమన్నారు. మొక్కలను విరివిగా నాటి పచ్చదనాన్ని వృద్ధి చేయాలన్నారు. ఆవులను చూసుకుంటూ, హైందవ ధర్మాన్ని కాపాడాలని గవర్నర్ సూచించారు . ఈ కార్యక్రమంలో రేవల్ల అవధాని, వారణాసికి చెందిన సూర్యనారాయణ స్వామి, ఉత్తర, కంచి పీఠంకు చెందిన చల్ల విశ్వనాథ శర్మ( శ్రీ కార్యం) , పద్మశ్రీ అవార్డు గ్రహీత సాయిబాబా గౌడ్, సహదేవ్, డొక్కా సత్య నారాయణ, జయరాం, జిల్లా కలెక్టర్ హనుమంతరావు, చౌటుప్పల్ ఆర్డీవో శేఖర్ రెడ్డి, మండల తహసిల్దార్ శ్రీనివాస్ రెడ్డి, పిల్లాయి పల్లి తాజా -మాజీ సర్పంచ్, అం దెల హరీష్ యాదవ్ తో పాటు పలువురు వేద పండితులు ,గోశాల ప్రతినిధులు, అంద విద్యార్థులు ,తదితరులు పాల్గొన్నారు.