Breaking News

మణుగూరు ఘటనపై ఆగ్రహం వ్యక్తం చేసిన బీఆర్ఎస్ రాష్ట్ర నాయకులు రాకేష్ రెడ్డి

మన ప్రగతి న్యూస్ / భద్రాద్రి కొత్తగూడెం జిల్లా

మణుగూరులో జరిగిన బీఆర్ఎస్ పార్టీ కార్యాలయంపై దాడిపై బీఆర్ఎస్ రాష్ట్ర నాయకుడు ఏనుగుల రాకేష్ రెడ్డి తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. ప్రభుత్వ పెద్దల ప్రణాళికతోనే ఈ దాడి జరిగిందని ఆయన ఆరోపించారు. కాంగ్రెస్ ప్రభుత్వ అరాచకత్వానికి ఈ ఘటన అద్దం పట్టిందన్నారు.ఆ సమయంలో కార్యాలయంలో కార్యకర్తలు ఉంటే ప్రాణ నష్టం సంభవించేదని పేర్కొన్నారు. ఉమ్మడి ఖమ్మం జిల్లాలో ప్రశాంత వాతావరణాన్ని కాంగ్రెస్ ప్రభుత్వం హత్య రాజకీయాలకు అడ్డాగా మార్చిందని విమర్శించారు.దాడిలో పాల్గొన్న కాంగ్రెస్ నాయకులను వెంటనే అరెస్ట్ చేసి కేసులు నమోదు చేయాలని, భవిష్యత్తులో ఇలాంటి ఘటనలు పునరావృతం కాకుండా చర్యలు తీసుకోవాలని రాకేష్ రెడ్డి డిమాండ్ చేశారు.

రెండు నెలల శిశువు మృతికి కారణమైన వారిని కఠినంగా శిక్షించాలి