Breaking News

ఏన్కూర్ లో వైభవంగా మంగళ కైసిక ద్వాదశి మహోత్సవం

భక్తి శ్రద్ధలతో యజ్ఞాలు, ఊరేగింపులో భక్తుల సందడి

మన ప్రగతి న్యూస్ /ఏన్కూర్

రెండు నెలల శిశువు మృతికి కారణమైన వారిని కఠినంగా శిక్షించాలి

ఏన్కూర్ లోని దాసరి కాలనీలో తిరుమల తిరుపతి దేవస్థానం ఆధ్వర్యంలో మంగళ కైసిక ద్వాదశి మహోత్సవం భక్తి శ్రద్ధలతో వైభవంగా నిర్వహించారు. ఈ సందర్భంగా వెంకటేశ్వర స్వామి చిత్రపటంతో ఊరేగింపు నిర్వహించగా భక్తులు పెద్ద ఎత్తున పాల్గొన్నారు.యజ్ఞ కార్యక్రమంలో మల్లు బిక్షం దంపతులు ప్రత్యేక పూజలు నిర్వహించారు. ఈ వేడుకకు ముఖ్య అతిథులుగా కాంగ్రెస్ పార్టీ సీనియర్ నాయకులు శెట్టిపల్లి వెంకటేశ్వరరావు, దాసుల కమిటీ సభ్యులు పూదూరి శేషయ్య, మల్లు బిక్షం, ధర్మపురి నరేష్, అభిమల్ల నాగేశ్వరరావు, నరసింహారావు, మల్లు పెద్ద నరసింహారావు, చిన్న నరసింహారావు, మహేష్ తదితరులు పాల్గొన్నారు.ఈ సందర్భంగా భక్తులు స్వామి దర్శనం చేసుకుని ఆశీర్వాదాలు పొందారు.