Breaking News

భారత మహిళా జట్టు వన్డే ప్రపంచ కప్ గెలుపు పట్ల నామ నాగేశ్వరరావు అభినందనలు

మన ప్రగతి న్యూస్/ ఖమ్మం జిల్లా

భారత మహిళా క్రికెట్ జట్టు తొలిసారిగా వన్డే ప్రపంచకప్‌ను కైవసం చేసుకొని భారత క్రీడా చరిత్రలో సువర్ణాక్షరాలతో నిలిచిందని బీఆర్ఎస్ పార్టీ సీనియర్ నాయకుడు, మాజీ లోక్‌సభ పక్ష నేత, ఖమ్మం మాజీ ఎంపీ నామ నాగేశ్వరరావు అభినందనలు తెలిపారు.ఈ సందర్భంగా నామ మాట్లాడుతూ, మహిళలు క్రీడారంగంలో చూపుతున్న ప్రతిభ దేశానికి గర్వకారణమని, ఈ విజయం భారత మహిళా శక్తి స్ఫూర్తిని ప్రపంచానికి చాటిందని పేర్కొన్నారు. ప్రపంచకప్ టోర్నీలో వరుసగా మూడు మ్యాచ్‌ల్లో ఓటమి ఎదురైనా ధైర్యంగా చివరి దాకా పోరాడి చరిత్ర సృష్టించిందని కొనియాడారు.సెమీఫైనల్లో ఆస్ట్రేలియాపై రికార్డు రన్స్ ఛేదన చేసి విజయం సాధించడమే కాకుండా, ఫైనల్లో దక్షిణాఫ్రికాపై సమిష్టిగా రాణించి ఘన విజయం సాధించడం దేశ ప్రజలకు గర్వకారణమని నామ అన్నారు.భవిష్యత్తులో కూడా ఇలాగే అంతర్జాతీయ వేదికపై భారత జెండాను ఎగురవేయాలని ఆకాంక్షిస్తూ, జట్టు కోచ్‌, మేనేజ్‌మెంట్‌, సపోర్ట్‌ స్టాఫ్‌ అందరికీ ఆయన హృదయపూర్వక అభినందనలు తెలిపారు.

రెండు నెలల శిశువు మృతికి కారణమైన వారిని కఠినంగా శిక్షించాలి