Breaking News

ఐకెపి కొనుగోలు కేంద్రాలను సద్వినియోగం చేసుకోవాలి

ఎంఈఓ కిషోర్ నాయక్

ఏపిఎం జానకి

మన ప్రగతి న్యూస్ నల్గొండ/వేములపల్లి

రెండు నెలల శిశువు మృతికి కారణమైన వారిని కఠినంగా శిక్షించాలి

ప్రభుత్వ ఏర్పాటు చేసిన కొనుగోలు కేంద్రాలను రైతులు సద్వినియోగం చేసుకోవాలని ఏపీఎం సూచించారు. వేములపల్లి మండలంలోని లక్ష్మీదేవి గూడెం ఐకెపి మహిళా సంఘం ఆధ్వర్యంలో గ్రామలలో వరి ధాన్యం కొనుగోలు కేంద్రాలను ఆమె ప్రారంభించారు. ఈ సందర్భంగా ఏపీఎం జానకి మాట్లాడుతూ కొనుగోలు కేంద్రాల్లో రైతులకు ఎటువంటి ఇబ్బందులు కలగకుండా అధికారులు తగిన జాగ్రత్తలు తీసుకోవాలని ఆమె సూచించారు. సన్న రకం వడ్లకు క్వింటాకు రూ. 2,389, దొడ్డు రకం వడ్లకు క్వింటాకు రూ. 2,369 ధరతో పాటు ప్రభుత్వ బోనస్ రూ. 500 కూడా అందిస్తామని తెలిపారు. రైతులు ఈ కొనుగోలు కేంద్రాలను సద్వినియోగం చేసుకోవాలన్నారు. ఈ కార్యక్రమంలో రైతులు అగ్రికల్చర్ ఏఈఓ లక్ష్మణ్ నాయక్, లక్ష్మీదేవి గూడెం గ్రామ మహిళా సంఘం అధ్యక్షురాలు చిన్నబోయిన లక్ష్మి , విబీకే ముత్యాల సరిత ,కృష్ణవేణి గ్రామా మహిళా సంఘాల సభ్యులు, అధికారులు తదితరులు పాల్గొన్నారు.