Breaking News

చర్చికి గృహ జ్యోతి

మన ప్రగతి న్యూస్/ నల్లబెల్లి

మండలంలోని ఓ చర్చికి గృహ జ్యోతి వర్తింప చేయడంతో ప్రజల్లో ఆగ్రహం రేపింది. అసలు లబ్ధిదారులకు గృహ జ్యోతి వర్తింప చేయకుండా చర్చికి గృహ జ్యోతి పథకము వర్తింప చేయడమేంటని ప్రజలు ఆశ్చర్యం వ్యక్తం చేస్తున్నారు. కాంగ్రెస్ ప్రభుత్వం ఆరు గ్యారెంటీలలో భాగంగా ప్రతి కుటుంబానికి ఉచితంగా 200 యూనిట్ల కరెంటును ఇవ్వాలన్న ఉద్దేశంతో వినియోగదారులకే వర్తిస్తుందని పేర్కొన్న అధికారులు సరిగా ధ్రువీకరించకుండానే బిల్లులు జారీ చేసినట్టు బయటపడింది. మండల కేంద్రంలోని ధార్మిక సంస్థకు విద్యుత్ మినహాయింపు ఎలా ఇచ్చారు. దానికి అనుమతి ఇచ్చిన వారు ఎవరు అధికారులు ఎవరి ఆధారంగా ఆ బిల్లును జారీ చేశారో ఇప్పటివరకు ఎవరు స్పష్టత లేదు. గృహ జ్యోతి పథకం వచ్చి రెండు సంవత్సరాలు కావస్తున్న ఇంతవరకు దాని మీద పట్టింపు లేకుండా జీరో బిల్లును జారీ చేయడం ఎంతవరకు కరెక్ట్ అని ప్రజలు మండిపడుతున్నారు. కొంతమంది ఇంకా బిల్లులు తగ్గక ఆర్థిక భారం మోస్తుంటే ధార్మిక సంస్థలు సౌకర్యం పొందడం ఏంటి అని ప్రశ్నలు వెళ్ళువెత్తుతున్నాయి. గృహ జ్యోతి పథకం పై అధికారుల నిర్లక్ష్యం వహించడం వలన ఇలా జరిగిందని గ్రామస్తులు అంటున్నారు. ప్రజాధనాన్ని అజాగ్రత్తగా వినియోగించిన అధికారులపై కఠిన చర్యలు తీసుకోవాలి. గృహ జ్యోతి వర్తింపు చేసినప్పటి నుంచి ఇప్పటివరకు జీరో బిల్లు మొత్తాన్ని బాధ్యుల నుంచి రికవరీ చేయాలని స్థానిక ప్రజలు డిమాండ్ చేస్తున్నారు. ఈ విధంగా కొనసాగితే గృహజ్యోతి పథకం పేదలకు మేలు చేయకపోవడం ఏకాకుండా ప్రజల్లో ప్రభుత్వంపై నమ్మకాన్ని కోల్పోయేలా చేస్తుంది అని అంటున్నారు. ప్రజల ఆశలు వెలుగులు నింపేలా ప్రభుత్వం చర్యలు తీసుకుంటే గృహ జ్యోతి నిజమైన ప్రజాప్రతికంగా నిలుస్తుంది లేదంటే ఈ జీరో బిల్లులు అధికారులు పనితీరికే మైనస్ మార్కులుగా మిగిలిపోతాయి. దీనిపైన అధికారులు తక్షణమే స్పందించి తగు చర్యలు తీసుకోవాలని లేని ఎడల అధికారులు తగిన మూల్యం చెల్లించుకోక తప్పదని సామాజిక కార్యకర్తలు హెచ్చరిస్తున్నారు.

రెండు నెలల శిశువు మృతికి కారణమైన వారిని కఠినంగా శిక్షించాలి