

మన ప్రగతి న్యూస్/ఏన్కూర్:
పాతర్లపాడు మాజీ సర్పంచ్, సిపిఎం సీనియర్ నాయకుడు కామ్రేడ్ సామినేని రామారావు అత్యంత కిరాతకంగా హత్య చేసిన దుండగులను వెంటనే అరెస్ట్ చేయాలని సిపిఎం పార్టీ మండల కార్యదర్శి దొంతబోయిన నాగేశ్వరరావు ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు.మంగళవారం ఏన్కూర్ ప్రధాన సెంటర్లో సిపిఎం మండల కమిటీ ఆధ్వర్యంలో ధర్నా నిర్వహించారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ సామినేని రామారావు హత్యకు వారం రోజులు అవుతున్నా ఇప్పటివరకు నిందితులను పట్టుకోకపోవడం పోలీసు శాఖపై నమ్మకం కోల్పోయే పరిస్థితి. ఇది పోలీసు వ్యవస్థకు సిగ్గుచేటు అన్నారు.ఉప ముఖ్యమంత్రి భట్టి విక్రమార్క సొంత నియోజకవర్గమైన మధిరలో ఇప్పటికే ముగ్గురు సిపిఎం నాయకులు హత్యకు గురయ్యారని గుర్తు చేశారు. ఈ హత్యలకు ఉప ముఖ్యమంత్రి నైతిక బాధ్యత వహించాలి అని ఆయన డిమాండ్ చేశారు.హత్య రాజకీయాలు మానుకోవాలని, ప్రజలలో భయభ్రాంతులు రేకెత్తించే చర్యలను ఖండిస్తున్నామని తెలిపారు. 75 ఏళ్ల వయస్సున్న వ్యక్తిని హత్య చేయడం దారుణం మధిర నియోజకవర్గంలో హత్య రాజకీయాలు ఆగకపోతే ప్రజల తీర్పు వచ్చే ఎన్నికల్లో తప్పదని ఆయన హెచ్చరించారు.ఈ కార్యక్రమంలో సిపిఎం మండల కమిటీ సభ్యులు తమ్మినేని వెంకటయ్య, రేపల్లెవాడ మాజీ ఎంపీటీసీ భూక్య లక్ష్మణ్, ఏర్పుల రాములు, సొసైటీ వైస్ చైర్మన్ రేగళ్ల తిరుమలరావు, స్వర్ణ కృష్ణారావు, గుడ్ల వెంకటేశ్వరరావు, నేలపట్ల వెంకటేశ్వరరావు, బుచ్చల వెంకటేశ్వర్లు, ఇల్లూరి రామచంద్రరావు, బత్తుల నాగయ్య, నామ కృష్ణారావు, రేపకుల నరసింహారావు, కర్లకంటి నాగమణి తదితరులు పాల్గొన్నారు.
