Breaking News

సునీతమ్మ గెలుపుతోనే గోపీనాథ్‌కి నిజమైన నివాళి మాజీ ఎంపీ నామ

జూబ్లీహిల్స్ ఉప ఎన్నికల్లో బిఆర్ఎస్ ప్రచారంలో ఖమ్మం మాజీ ఎంపీ నామ నాగేశ్వరరావు

మన ప్రగతి న్యూస్/ఏన్కూర్

వేములవాడలో భారీగా మద్యం స్వాధీనం

జూబ్లీహిల్స్ ఉప ఎన్నికల ప్రచారాన్ని వేడెక్కిస్తూ బిఆర్ఎస్ పార్టీ తరపున మాజీ లోక్‌సభ పక్షనేత, ఖమ్మం మాజీ ఎంపీ నామ నాగేశ్వరరావు విస్తృతంగా పర్యటించారు. వెంగళరావు డివిజన్ ఎన్నికల ఇన్‌చార్జి ఎమ్మెల్సీ తాతా మధుసూదన్‌తో కలిసి స్థానిక ప్రాంతాల్లో ఇంటింటికీ వెళ్లి ప్రజలను కలుసుకున్నారు.ఈ సందర్భంగా నామ మాట్లాడుతూ,స్వర్గీయ మాగంటి గోపీనాథ్ ప్రజల మధ్య కలిసిపోయి సేవలందించిన నాయకుడు. ఆయన సతీమణి సునీతమ్మ గెలుపుతోనే గోపీనాథ్ కి నిజమైన నివాళి అవుతుంది. ప్రజల ఆశీస్సులతో ఆమె తప్పక గెలుస్తారని నమ్మకం అన్నారు.ప్రచారంలో పాల్గొన్న ఎమ్మెల్సీ తాతా మధుసూదన్, ఎమ్మెల్యే డా. సంజయ్, మాజీ ఎమ్మెల్యే నల్లమోతు భాస్కర్ రావులతో కలిసి నామ ఉప ఎన్నికల వ్యూహాలపై చర్చించారు. అనంతరం బిఆర్ఎస్ అభ్యర్థి మాగంటి సునీత గోపినాధ్‌కు మద్దతుగా పలువురు ప్రముఖులను, స్థానిక నేతలను కలుసుకున్నారు.ప్రజల ఆశీర్వాదాలతో సునీతమ్మ భారీ మెజార్టీతో గెలిచి బిఆర్ఎస్ పార్టీ విజయపతాక ఎగరేస్తుందని నామ స్పష్టం చేశారు. పార్టీ నాయకులు, కార్యకర్తలు ఇంటింటికీ వెళ్లి ప్రచారాన్ని మరింత ముమ్మరం చేయాలని ఆయన సూచించారు.ఈ కార్యక్రమంలో ఖమ్మం జిల్లా నేతలు తాళ్లూరి జీవన్ కుమార్, బెల్లం వేణుగోపాల్, వెంగళరావు డివిజన్ సొసైటీ మాజీ అధ్యక్షులు కేతినేని రామారావు, మంచిరెడ్డి బంటి, స్థానిక బిఆర్ఎస్ నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు.