

మన ప్రగతి న్యూస్/ఏన్కూర్:
ఏన్కూరు మండల వ్యాప్తంగా బుధవారం కార్తీక పౌర్ణమి వేడుకలు భక్తిశ్రద్ధలతో ఘనంగా నిర్వహించారు. ఏన్కూర్ గ్రామంలోని శ్రీ శ్రీ శ్రీ అన్నపూర్ణ సమేత కాశీ విశ్వేశ్వర ఆలయంలో కార్తీక పౌర్ణమి పర్వదినాన్ని పురస్కరించుకుని విశేష కార్యక్రమాలు నిర్వహించారు.ఉదయం శివాభిషేకాలతో కార్యక్రమాలు ప్రారంభమయ్యాయి. అనంతరం ఉదయం శ్రీ సత్యనారాయణ స్వామి వ్రతం నిర్వహించగా, సాయంత్రం జ్వాలాతోరణం మరియు ఆకాశ దీపోత్సవం ఘనంగా నిర్వహించారు. భక్తులు తెల్లవారుజామున మరియు సాయంత్రం 365 ఒత్తులు వెలిగించి భగవంతుడి కృపకు ప్రార్థనలు చేశారు.భక్తులు పెద్ద సంఖ్యలో పాల్గొని శివపార్వతుల దర్శనం చేసుకొని తీర్థప్రసాదాలు స్వీకరించారు. భక్తుల సౌకర్యార్థం ఆలయ ప్రాంగణంలో అన్ని ఏర్పాట్లు చేసినట్లు శ్రీ కాశీ విశ్వేశ్వర ఆలయ కమిటీ సభ్యులు తెలిపారు.
