పూజలో పాల్గొన్న బీసీ నేత పొన్నం ఉపేందర్ నాయుడు…
మన ప్రగతి న్యూస్ / ఉమ్మడి ఖమ్మం జిల్లా బ్యూరో :
ఖమ్మం జిల్లా కూసుమంచి మండల పరిధిలోని కాకతీయుల కాలంనాటి గణపేశ్వర శివాలయం లో ప్రాతః కాలం ( వేకువ జాము ) నుండే ఉపవాసం ఉన్నటువంటి భక్తులు ఉసిరి, యాప, రావిచెట్ల కింద ద్వేదీపనైవేద్యాలతో హరతులు సమర్పించుకుంటూ శివనామస్మరంతో ఓం నమశ్శివాయ అంటూ భక్తులు ఘనంగా “కార్తీక పౌర్ణమి”భక్తిశ్రద్ధలతో జరుపుకున్నారు. ఈ పూజ కార్యక్రమంలో పాల్గొన్నతెలంగాణ బీసీ సంక్షేమ సంఘం భద్రాద్రి కొత్తగూడెం జిల్లా అధ్యక్షుడు పొన్నం ఉపేందర్ నాయుడు ఉమ్మడి ఖమ్మం జిల్లా ప్రజలకు “కార్తీకపౌర్ణమి” శుభాకాంక్షలు తెలియజేసినారు.

