Breaking News

ఇందిరమ్మ రాజ్యంలో..ఇసుకాసురులు..!

  • ఎన్ హెచ్ – 163 పోలీస్ స్టేషన్ పక్కనే ఆగని ఇసుక దందా..!
  • పట్టించుకోని పోలీసులు, రెవెన్యూ,మైనింగ్ అధికారులు
  • చోద్యం చూస్తున్న అధికార యంత్రాంగం
  • వాల్టా చట్టానికి తూట్లు మన ప్రగతి న్యూస్/ రఘునాథపల్లి :

రఘునాథ్ పల్లి మండల కేంద్రంలో ఇందిరమ్మ ఇళ్ల పేరు మీద అక్రమంగా ఇసుక రవాణా చేస్తున్నారు. వాల్టా చట్టానికి తూట్లు పొడుస్తున్నట్లు ఉన్నదని ప్రజల నుండి విమర్శలు వస్తున్నాయి. గ్రామస్తులు అధికారులకు పలుమార్లు ఫిర్యాదు చేయడం జరిగింది. అయినప్పటికీ ఇసుక మాఫియా ఆగడం లేదు.ఇట్టి విషయంపై 100 డయల్ ద్వారా ఫిర్యాదు చేయగా పెట్రోలింగ్ కానిస్టేబుల్ అనుమతి ఉన్నది అని చెప్పాడం జరిగింది. ఎవరు అనుమతి ఇచ్చారు అని అడగగా తహసీల్దార్ ఇచ్చారని చెప్పాడు.తహసీల్దార్ కు ఫోను కలిపి కాన్ఫరెన్స్ లో మాట్లాడగా, తహసీల్దార్ పోలీస్ కానిస్టేబుల్ కి మేము రఘునాథపల్లి లో ఇసుక తీయడానికి ఎటువంటి అనుమతులు ఇవ్వలేదు అని చెప్పారు. ఇవ్వలేదు మీరు చర్యలు తీసుకోండి అని పెట్రోలింగ్ కానిస్టేబుల్ ని కోరగా.., దురుసుగా మాట్లాడుతూ ( పోటుగాడివి నువ్వే వచ్చినావు ఇగ) అని సంభాషించాడు., ఇట్టి విషయంపై అత్యవసర సహాయం అందించాల్సిన పెట్రోలింగ్ కానిస్టేబుల్ అసభ్యంగా మాట్లాడడం సరికాదు అని క్రమశిక్షణ చర్యలు తీసుకోవాలని పోలీసు కమిషనర్ కు విన్నపించడం జరిగినది . పిర్యాదులో సంబంధిత ఆధారాలు అన్ని పోలీస్ కమిషనర్ కు వాట్సాప్ ద్వారా పంపడం జరిగినది. ఇందిరమ్మ ఇండ్ల పేరుతో అక్రమ ఇసుక రవాణా పైన కఠినంగా ప్రజా ప్రభుత్వం చర్యలు ఉండాలని పలువురు కోరుతున్నారు.

రెండు నెలల శిశువు మృతికి కారణమైన వారిని కఠినంగా శిక్షించాలి